బదిలీల్లో లోపాలను కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లండి | - | Sakshi
Sakshi News home page

బదిలీల్లో లోపాలను కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లండి

May 28 2025 12:18 AM | Updated on May 28 2025 12:18 AM

బదిలీల్లో లోపాలను కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లండి

బదిలీల్లో లోపాలను కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లండి

మెరకముడిదాం: ఉపాధ్యాయుల బదిలీల్లో అసంబద్ధమైన విషయాలను కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడిని పీఆర్‌టీయూ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ఆల్తిరాంబాబు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన విజయనగరంలో ఎమ్మెల్సీ గాదెను ఆయన ఇంటివద్ద కలిసి ఎస్టీటీ ఉపాధ్యాయులు బదిలీల్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరించారు. వాటిని వెంటనే కమిషనర్‌ స్థాయిలో పరిష్కరించాలని కోరారు. ఈ విషయంలో ఎస్జీటీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పీఆర్‌టీయూ నాయకులు కృష్ణమూర్తి, రామకృష్ణ ఉన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీని కోరిన పీఆర్‌టీయూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement