
బదిలీల్లో లోపాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లండి
మెరకముడిదాం: ఉపాధ్యాయుల బదిలీల్లో అసంబద్ధమైన విషయాలను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడిని పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఆల్తిరాంబాబు కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన విజయనగరంలో ఎమ్మెల్సీ గాదెను ఆయన ఇంటివద్ద కలిసి ఎస్టీటీ ఉపాధ్యాయులు బదిలీల్లో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వివరించారు. వాటిని వెంటనే కమిషనర్ స్థాయిలో పరిష్కరించాలని కోరారు. ఈ విషయంలో ఎస్జీటీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పీఆర్టీయూ నాయకులు కృష్ణమూర్తి, రామకృష్ణ ఉన్నారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీని కోరిన పీఆర్టీయూ