
పైడితల్లికి మామిడి పండ్ల నివేదన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి మంగళవారం మామిడిపండ్లతో నివేదన చేశారు. అమ్మవారు పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతా లతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట రావు, తాళ్లపూడి ధనుంజయ్, నేతేటి ప్రశాంత్లు శాస్త్రోక్తంగా నిత్య పూజలు చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప,రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్వీడీ వీ ప్రసాద్ కార్యక్రమాలను పర్యవేక్షించారు.
లారీ ఇంజిన్లో మంటలు
పార్వతీపురం రూరల్: విశాఖ నుంచి ఒడిశాలోని రాయగడ ప్రాంతానికి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ ట్రాఫిక్ కూడలి వద్ద మంగళవారం ఉదయం 7గంటలకు జరిగిన ఈ సంఘటనను గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై లారీని నిలిపివేసి స్థానికుల సహాయంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. దీంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఒక్కసారిగా లారీ ఇంజిన్లో నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు, వాహనచోదకులు భయభ్రాంతులకు గురయ్యారు.
తల్లి మందలించిందని
తనయుడి ఆత్మహత్య
రాజాం సిటీ: మద్యం తాగవద్దని తల్లి మందలించిందని మనస్తాపం చెందిన తనయుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని బొమ్మినాయుడువలసలో మంగళవారం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఏఎస్సై కేవీ రమణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బొమ్మినాయుడువలస గ్రామానికి చెందిన నరం సురేష్ (33)ను మద్యం తాగవద్దని తల్లి నరసమ్మ మందలించింది. ఆమె మందలించడాన్ని జీర్ణించుకోలేక ఈ నెల 22న మద్యం మత్తులో గడ్డిమందు తాగేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ను స్థానికులు శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడని ఏఎస్సై తెలిపారు. ఈ ఘటనపై మృతుడి తమ్ముడు శివప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై తెలిపారు.

పైడితల్లికి మామిడి పండ్ల నివేదన

పైడితల్లికి మామిడి పండ్ల నివేదన