
రామనారాయణాన్ని సందర్శించిన దేవిశ్రీప్రసాద్
విజయనగరం రూరల్: విజయనగరంలోని ఆధ్యా త్మిక పర్యాటక కేంద్రం రామానారాయణంను సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ మంగళవారం సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో గోడలకు చెక్కిన రామాయణం ఘట్టాలను తిలకించారు. రామనారాయణం పరిశోధన కోసం ఏర్పాటుచేసిన వాల్మీకి కేంద్రాన్ని సందర్శించారు. ఈ ప్రదేశం ఎంతో పవిత్రతను సంతరించుకుందని అభిప్రాయపడ్డారు. ఆలయ అర్చకుడు చాణక్య, శ్రీహర్ష ప్రత్యేక పూజలుచేసి దేవీశ్రీ ప్రసాద్కు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఎన్సీఎస్ ట్రస్టు సభ్యులు నారాయణ శ్రీనివాస్ జ్ఞాపికను బహూకరించారు.