
కార్యకర్తల జోలికొస్తే ఊరుకోం
పూడూరు: తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొప్పుల రాజశేఖర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. పార్టీ నాయకుడు, సినిమా సెన్సార్ బోర్డు సభ్యుడు మల్లేష్ పటేల్పై అక్రమ కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించరాదని హితవు పలికారు. బీజేపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్, మాజీ అధ్యక్షుడు అనిల్, నాయకులు శ్రీశైలం, శివరాజ్, పాండు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి