
గుర్తు తెలియని జంతువు దాడిలో మేక మృతి
కుల్కచర్ల: గుర్తు తెలియని జంతువు దాడిలో మేక మృతి చెందిన ఘటన చౌడాపూర్ మండల పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మందిపల్ గ్రామానికి చెందిన సంటి అంజయ్య బుధవారం రోజులాగే తన పొలం దగ్గర పశువులతో పాటుగా మేకలను కట్టేసి ఇంటికి వచ్చాడు. గురువారం తెల్లవారుజామున పొలానికి వెళ్లి చూడగా ఓ మేక రక్తపుమడుగులో పడి చనిపోయి ఉంది. ఎక్కువ శాతం మాంసం తినేసింది. కాగా పరిసర ప్రాంతాల్లో చిరుత ఆనవాళ్లు కనిపించాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శ్రీధర్ ఘటనాస్థలికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. రైతులు అటవీప్రాంతంలో పశువులను కట్టేయరాదని, ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

గుర్తు తెలియని జంతువు దాడిలో మేక మృతి