
భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించండి
తాండూరు: ఆలయాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని పొట్లి మహరాజ్, సీతారాంపేట్ ఆంజనేయ స్వామి ఆలయాల నూతన పాలకమండలి సభ్యులు ఎమ్మెల్యే సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. పొట్లి మహరాజ్ ఆలయ చైర్మన్గా ప్రసాద్గౌడ్, సభ్యులుగా నవీన్గౌడ్, జగన్నాథ్, సిద్దమ్మ, శ్రీనివాస్, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా అనంత్ భట్, సీతారాంపేట్ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్గా భీమలింగం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈఓ నరేందర్, భద్రేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ పటేల్ కిరణ్కుమార్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్కుమార్, అబ్దుల్ రవూఫ్, ప్రభాకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి