
అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే
తాండూరు టౌన్: గతంలో ప్రైవేటు పాఠశాలలకు పరిమితమైన గ్రాడ్యుయేషన్ డే మంగళవారం పట్టణంలోని గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు నల్ల కోటు, టోపి ధరించి సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన సామాజిక కార్యకర్త, తాండూరు సత్యసాయి ట్రస్ట్ అధ్యక్షుడు జగదీశ్వర్ సింగ్ ఠాకూర్, మాజీ కౌన్సిలర్ సంగీతా ఠాకూర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ సెంటర్లో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతీ అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం డాక్టర్ రాజేశ్వరి, అంగన్వాడీ టీచర్ రాధ, ఏఎన్ఎం శాంత, ఆశ వర్కర్ సుజాత, ఆయమ్మ అనితను అతిథులు ఘనంగా సన్మానించారు.