
బాబు బూటకపు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లండి
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవి చేస్తాం, ఇవి చేస్తామంటూ మేనిఫెస్టో బాండ్లను ఇచ్చి మోసగించిన చంద్రబాబు మోసాలను వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ చిత్తూరు,తిరుపతి జిల్లాల అధ్య క్షులు భూమన కరుణాకరరెడ్డి సూచించారు. తిరుపతి మారుతీనగర్లోని పెద్దిరెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మెయిళ్ల గౌరీ, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షురాలు బొర్ర మాదవిరెడ్డి తదితరులు శనివారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని, తిరుపతి పద్మావతిపురంలోని భూమన కరుణాకరరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి దుస్సాలువలు కప్పి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్. జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లాలన్నారు. చంద్రబాబు ప్రజలకు చేస్తున్న మోసాలను వివరించడంలో మహిళా విభాగం కీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఏడాది పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయకపోయినా అన్నీ చేసేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదన్న విషయాన్ని ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని సూచించారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను పట్టించుకోకుండా, మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందన్న విషయాన్ని మహిళలకు తెలియజేయాలన్నారు.
● వైఎస్సార్సీపీ మహిళా విభాగానికి సూచించిన పెద్దిరెడ్డి, భూమన

బాబు బూటకపు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లండి