● జగన్నాథుడి రథయాత్ర | - | Sakshi
Sakshi News home page

● జగన్నాథుడి రథయాత్ర

Jun 29 2025 2:22 AM | Updated on Jun 29 2025 2:22 AM

● జగన్నాథుడి రథయాత్ర

● జగన్నాథుడి రథయాత్ర

ఒడిశాలోని పూరి జగన్నాథుని రథయాత్ర శనివారం సూళ్లూరుపేట పట్టణానికి చేరుకుంది. నెల్లూరు ఇస్కాన్‌ టెంపుల్‌ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 2.30 గంటలకు పట్టణంలోని పురవీధుల గుండా రథయాత్ర భక్తజన సందోహం మధ్య నిర్వహించారు. హరేరామ, హరేకృష్ణ నామస్మరణలతో పట్టణం మారుమోగిపోయింది. చెక్క భజనలు, కోలాటాలతో రథయాత్ర ముందు నిర్వహించారు. రథయాత్ర ముగింపు అనంతరం శ్రీనగర్‌ కాలనీలో స్వామి వారికి నేతి దీపారాధన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో నెల్లూరు, సూళ్లూరుపేట ఇస్కాన్‌ టెంపుల్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. – సూళ్లూరుపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement