జగన్నాథుడి రథయాత్ర | - | Sakshi
Sakshi News home page

జగన్నాథుడి రథయాత్ర

Jun 29 2025 2:21 AM | Updated on Jun 29 2025 2:21 AM

జగన్న

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథ రథయాత్ర శనివారం సూళ్లూరుపేటకు చేరుకోవడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2025

8లో

ఇళ్లు, విల్లాలపై పడి దోచుకుంటున్న దొంగలు ఇప్పుడు కొత్త రూటును ఎంచుకుంటున్నారు. ఇటీవల బంగారానికి భారీగా డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ఏకంగా రైలు ప్రయాణికులనే టార్గెట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా స్లీపర్‌ క్లాసుల్లోని ప్రయాణికులనే ఎంచుకుని చెలరేగిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞాన్ని చాకచక్యంగా సిగ్నల్‌ వ్యవస్థను వినియోగించుకొని ట్యాంపరింగ్‌ చేసి అడ్డదిడ్డంగా దోచేస్తున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే సామాన్య ప్రయాణికులను సైతం భయాందోళనకు గురిచేస్తున్నారు. వీరిని కట్టడి చేయడంలో సంబంధిత అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలు.. వాటి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ‘సాక్షి’ స్పెషల్‌ ఫోకస్‌..

రైళ్లలో రాత్రివేళ చెలరేగిపోతున్న దొంగలు

బంగారు నగలే లక్ష్యంగా దోపిడీ సిగ్నల్‌ ట్యాంపరింగ్‌తో చోరీలు

రెండు నెలల్లో మూడు ఘటనలు దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు

ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలంటున్న అధికారులు

సిగ్నల్‌

ట్యాంపరింగ్‌తో

దోపిడీ

ఏసీల కంటే స్లీపర్‌ క్లాస్‌లో చోరీలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సాధారణంగా రైల్వేస్టేషన్‌లో సిగ్నల్‌ వ్యవస్థ ఉంటుంది. ఇందులో రెడ్‌, గ్రీన్‌, ఆరెంజ్‌ రంగుల లైట్స్‌కు సంబంధించి బాక్స్‌లో మానిటరింగ్‌ వ్యవస్థ ఉంటుంది. స్టేషన్‌ టు స్టేషన్‌ (మిడ్‌ స్టేషన్‌) మధ్యలో ఉండే సిగ్నల్‌ మానిటరింగ్‌ వ్యవస్థలో రెడ్‌, గ్రీన్‌ లైట్స్‌ మాత్రమే ఉంటాయి. ఇందులో గ్రీన్‌ లైట్‌ వైర్‌ను దొంగలు తీసివేస్తున్నారు. ఆ సమయంలో సిగ్నల్‌ చూపితే రెడ్‌లైట్‌ మాత్రమే వెలుగుతుంది. ఆ సిస్టమ్‌ను కనుక్కొని దొంగల ముఠా దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జరిగిన ఘటనలు

● మే 2న రాత్రి 10.30 గంటలకు ముంగిలిపట్లు రైల్వేస్టేషన్‌ పరిధిలో హోమ్‌సిగ్నల్‌ వ్యవస్థ ట్యాంపరింగ్‌కు గురైంది. రెడ్‌లైట్‌ వెలుగుతుండడంతో రైలు ఆగిన తర్వాత కొందరు దుండగలు దొంగతనానికి పాల్పడ్డారు. ఇద్దరి ప్రయాణికుల మెడలో బంగారు గొలుసులు తీసుకొని పారిపోయారు.

● మే 14న వేకువజామున 2.30 గంటలకు అదే ముంగిలిపట్లు రైల్వేస్టేషన్‌ పరిధిలో మళ్లీ హోమ్‌సిగ్నల్‌ వ్యవస్థ ట్యాంపరింగ్‌ చేశారు. కొందరు రైలు బయట నుంచే బంగారు గొలుసులు దొంగలించారు.

● జూన్‌ 26 వేకువజామున 2.30 గంటలకు సిద్ధంపల్లె రైల్వేస్టేషన్‌ పరిధిలో హోమ్‌ సిగ్నల్‌ వ్యవస్థ ట్యాంపరింగ్‌ గురవ్వడంతో రైలును ఆపేశారు. కొంతమంది ప్రయాణికుల మెడలోని బంగారు గొలుసులను తెంచుకొని వెళ్లారు. ఈ మూడు దొంగతనాల్లో 10 మంది మహిళల మెడల్లోని దాదాపు 120 గ్రాముల పైగా బంగారాన్ని కాజేశారు.

చిత్తూరు కార్పొరేషన్‌: రైలు ప్రయాణమంటేనే ఉమ్మడి జిల్లాల ప్రజలు వణికిపోతున్నారు. ఇటీవల వరుసుగా చోటుచేసుకుంటున్న ఘటనలు తలుచుకుని భయాందోళనకు గురవుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లు లేకపోవడం.. కిక్కిరిసిన జనాల మధ్యన ప్రయాణం చేయాల్సి రావడంతో దొంగలకు వరంగా మారింది. ప్రయాణికుల సంఖ్యకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో చోరీల నివారణ కష్టతరమవుతోంది. ఎక్కువగా రాత్రి 10.30 నుంచి వేకువజామున 3 గంటల లోపు దొంగతనాలు జరగుతున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో దొంగలు దోపిడీకి పాల్పడుతున్నారు. కిటీకీల వద్ద నగలు చోరీ చేసి పరారవుతున్నారు.

బంగారు నగలే లక్ష్యం

రైళ్లలో చిల్లర దొంగతనాలు పాత పద్ధతి. ఇప్పుడు దొంగలు రూట్‌ మార్చారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో బంగారాన్ని చాకచక్యంగా కొట్టేసేందుకు పూనుకుంటున్నారు. ఊర్లకు వెళ్లేటప్పుడు మహిళలు ఆభరణాలు ధరించుకువెళ్లడం అలవాటుగా మారిన నేపథ్యంలో దొంగలు వారినే టార్గెట్‌ చేస్తున్నారు. ఎక్కువగా రైలు కిటికీల నిద్రిస్తున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను దోచుకెళ్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, రోడ్డుకు దగ్గర్లో ఉండే స్టేషన్లను ఎంపిక చేసుకుంటున్నారు. అక్కడ సిగ్నల్‌ ట్యాంపరింగ్‌ చేసి నిమిషాల్లో తమ పనికానిచ్చేస్తున్నారు.

మహారాష్ట్ర ముఠాగా అనుమానం

వరుస దొంగతనాల వెనుక మహారాష్ట్ర (పార్థీ గ్యాంగ్‌) ముఠాకు చెందిన వారు ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, రాజస్థాన్‌లలో నేరాలకు పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. వీరు 4–8 మంది దొంగతనానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. చిత్తూరు రూరల్‌ మండలం, సిద్ధంపల్లె స్టేషన్‌ సమీపంలో జరిగిన ఘటనలో వేకువజామున 2.30 గంటలకు రైలు ఆగింది. దుండగలు రైలు వెలుపల ఒకరు వెనుక ఒకరు ఉన్నారు. ఒకరి భుజం పై మరొకరు కూర్చొని తెరిచిన కిటికీల్లో టార్చ్‌ వేస్తూ ఓ మహిళ మెడలో బంగారు గొలుసు తెంపారు. ఇలా ఎస్‌–7, 10 బోగిల్లో నలుగురి వద్ద 60 గ్రాముల వరకు బంగారం దోచుకున్నారు. రైలులో ఉండే బీట్‌ పోలీసులు విజిల్స్‌ వేసే లోపల దొంగలు తప్పించుకున్నారు. ఘటన జరిగిన అర గంటలో రైల్వే పోలీసులు చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

అరకొరగా ఎస్కార్ట్‌

జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌ పోలీసులు అరకొరగా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్కొక్క స్టేషన్‌ నుంచి ఇద్దరు బీట్‌ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. ఒక బీట్‌లో 3 నుంచి 4 రైళ్లను కవర్‌చేసే విధంగా డ్యూటీలు అమలు చేస్తున్నారు. వీరితో పాటు ఆర్‌ఫీఎఫ్‌ విభాగం నుంచి ఇద్దరు ఉంటారు. కనీసం ఒక బీట్‌కు నలుగురు జీఆర్పీ పోలీసులు, నలుగురు ఆర్పీఎఫ్‌ పోలీసులు వివిధ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కవర్‌చేసే విధంగా ఉంటే భద్రత పటిష్టపరిచే విధంగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. ఆర్‌పీఎఫ్‌ విభాగానికి చెందిన వారి విధులు బలోపేతంగా లేవన్న విమర్శలున్నాయి. రైళ్లలో దోపిడీ దొంగలు చెలరేగిపోతున్నా జీఆర్పీ పోలీసులకు కాల్చివేత ఉత్తర్వులు అమలు కాలేదు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత స్లీపర్‌క్లాస్‌లో ఎక్కడ సీట్లు ఖాళీగా ఉన్నాయో చూసుకుని నిద్రలోకి జారుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వెంకట్రాది ఎక్స్‌ప్రెస్‌ రైలులో కడప రైల్వేస్టేషన్‌ వరకు ఇద్దరు ఎస్కార్ట్‌గా వచ్చి కడపలో దిగుతున్నారు.

– 8లో

గస్తీ ముమ్మరం

రైళ్లలో దొంగతనాల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. వివిధ బృందాలు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నాయి. త్వరలో నిందితులను పట్టుకుంటాం. రైళ్లలో ప్రయాణించే సమయంలో ప్రయాణికులు అప్రమ్తతంగా ఉండాలి. వేసవి దృష్ట్యా రైళ్లలో గస్తీని ముమ్మరం చేశాం. నేరాలు జరగకుండా ప్రతి రైల్వే స్టేషన్‌లో పికెట్లు ఏర్పాటు చేశాం. పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రయాణికులు సహకరించాలి.

– హర్షిత, రైల్వే డీఎస్పీ, గుంతకల్లురేంజ్‌

రెండు నెలల్లో మూడు రాబరీలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు నెలల వ్యవధిలో మూడు రాబరీలు జరిగాయి. ఇందులో రెండు తిరుపతి జిల్లాలోని ముంగలిపట్టు వద్ద కాగా మరొకటి చిత్తూరు జిల్లా సిద్ధంపల్లె సమీపంలో చోటు చేసుకుంది. చిత్తూరులో ఇటువంటి దోపిడీ జరగడం ఇదే మొదటి సారి. కానీ ఈ దొంగతనాల్లో దాదాపు రూ.15 లక్షల విలువైన 120 గ్రాముల బంగారం దొంగతనం జరిగినట్లు సమాచారం. ఇటీవల చిత్తూరు రూరల్‌ పరిధిలో జరిగిన రాబరిపై పోలీసులు ప్రత్యేక బృందంగా విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలంలో దొరికిన బ్యాగ్‌లను పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌, యాక్టివ్‌ క్రిమినల్స్‌ గురించి ఆరా తీస్తున్నారు.

జగన్నాథుడి రథయాత్ర 
1
1/5

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర 
2
2/5

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర 
3
3/5

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర 
4
4/5

జగన్నాథుడి రథయాత్ర

జగన్నాథుడి రథయాత్ర 
5
5/5

జగన్నాథుడి రథయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement