
ఎస్వీ మ్యూజియం అభివృద్ధి పనులపై సమీక్ష
తిరుమల: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు మ్యూజియం చీఫ్ ఆఫీసర్ (ఇన్చార్జి) సోమన్ నారాయణ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పనుల పురోగతిని వివరించారు. అదనపు ఈవో మాట్లాడుతూ మ్యూజియాన్ని ప్రపంచ స్థాయి వస్తు ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాలని సూచించారు. భద్రతకు సంబంధించి సీసీ కెమెరాలు, హెడ్ కౌంట్ సెన్సార్లు తదితరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మ్యూజియం ప్రాంగణంలో అభిప్రాయ సేకరణ కోసం ఫీడ్ బ్యాక్ కియోస్క్ను ఏర్పాటు చేయాలన్నారు. మ్యూజియం తెరిచే సమయం, టికెట్ ధర, కళాఖండాల సంరక్షణ గది, అధికారిక సెల్ఫీ పాయింట్ తదితర అంశాలపై ఆరా తీశారు. టీటీడీ సీఈ సత్యనారాయణ, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, ఈఈలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, మనోహర్, ఎలక్ట్రికల్ డీఈ చంద్రశేఖర్, వీజీవో సురేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మధుసూదన్, మ్యూజియం క్యూరేటర్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.