
తుడాను సందర్శించిన ‘కాగ్’
తిరుపతి తుడా : తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా)ను బుధవారం కాగ్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా వీసీ మౌర్య తుడా చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న అకౌంటింగ్ విధానాలను కాగ్ బృందానికి వివరించారు. డిజిటలైజేషన్కు తక్షణం చర్యలు చేపట్టాని కాగ్ కమిటీ అధికారులకు సూచించింది. సమావేశంలో అడిషనల్ డిప్యూటీ కాగ్ రీవూ ప్రకాష్, కాగ్ డైరెక్టర్ జనరల్ రష్మీ అగర్వాల్, డిప్యూటీ అకౌంటింగ్ జనరల్ ఎన్వీ నిఖిత, సీనియర్ డిప్యూటీ అకౌంటింగ్ జనరల్ ఆర్.శ్యామ్, తుడా కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ బాబు పాల్గొన్నారు.