
సముద్రంలో మునిగి బాలిక మృతి
కోట : మండలంలోని శ్రీనివాససత్రం బీచ్లో బుధవారం సముద్రంలో మునిగి ఓ బాలిక మృతి చెందింది. వివరాలు.. స్థానిక మత్య్సకారుడు అక్కయ్యగారి లక్ష్మయ్య, సోమియా దంపతుల కుమార్తె పల్లవి(13) తిరుపతిలో చదువుకుంటూ వేసవి సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. బంధువులతో కలిసి సముద్రస్నానానికి వెళ్లింది. అలల ఉధృతికి మునిగిపోయింది. సమీపంలోని మత్స్యకారులు వెంటనే బాలికను బయటకు లాగేశారు. అపస్మారకస్థితికి చేరడంతో హుటాహుటిన చింతవరం వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై ఎలాంటి సమాచారం అందలేదని ఎస్ఐ పవన్కుమార్ తెలిపారు.