సముద్రంలో మునిగి బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

సముద్రంలో మునిగి బాలిక మృతి

May 29 2025 10:02 AM | Updated on May 29 2025 10:02 AM

సముద్రంలో మునిగి బాలిక మృతి

సముద్రంలో మునిగి బాలిక మృతి

కోట : మండలంలోని శ్రీనివాససత్రం బీచ్‌లో బుధవారం సముద్రంలో మునిగి ఓ బాలిక మృతి చెందింది. వివరాలు.. స్థానిక మత్య్సకారుడు అక్కయ్యగారి లక్ష్మయ్య, సోమియా దంపతుల కుమార్తె పల్లవి(13) తిరుపతిలో చదువుకుంటూ వేసవి సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. బంధువులతో కలిసి సముద్రస్నానానికి వెళ్లింది. అలల ఉధృతికి మునిగిపోయింది. సమీపంలోని మత్స్యకారులు వెంటనే బాలికను బయటకు లాగేశారు. అపస్మారకస్థితికి చేరడంతో హుటాహుటిన చింతవరం వైద్యశాలకు తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై ఎలాంటి సమాచారం అందలేదని ఎస్‌ఐ పవన్‌కుమార్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement