
అక్రమ కేసులకు భయపడం
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేసినా భయపడే ప్రసక్తేలేదు. గోవర్ధన్రెడ్డిని ఎలాగైనా హింసలకు గురిచేయాలనే కూటమి ప్రభుత్వం అక్రమ మైనింగ్ కేసును బనాయించింది. మైనింగ్ వ్యవహరంలో ఎలాంటి పాత్ర లేని ఆయనపై వివిధ సెక్షన్లపై కేసులు పెట్టి వేధిస్తోంది. ప్రజలపక్షాన నిరంతరం పోరాడే మాజీ మంత్రిపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగానికి తెరదీసి అక్రమ కేసులు ఎలా పెట్టాలో నేర్పి స్తున్నారు. జిల్లా ప్రజలు అంతా కాకాణి వెంటే ఉన్నారు. ఆయనకు మద్దతుగా న్యాయపోరాటం కొనసాగిస్తాం.
–అనిల్కుమార్ యాదవ్, మాజీ మంత్రి