● అలంకారప్రాయంగా రైతు సేవా కేంద్రాలు ● రేషనలైజేషన్‌ పేరుతో నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

● అలంకారప్రాయంగా రైతు సేవా కేంద్రాలు ● రేషనలైజేషన్‌ పేరుతో నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం

May 26 2025 12:12 AM | Updated on May 26 2025 12:12 AM

● అలం

● అలంకారప్రాయంగా రైతు సేవా కేంద్రాలు ● రేషనలైజేషన్‌ పేర

తిరుపతి అర్బన్‌ : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్నదాతలకు రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే) విశేష సేవలందించాయి. అయితే కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత ఆర్‌బీకేలను రైతు సేవా కేంద్రాలు(ఆర్‌ఎస్‌కే)గా మార్చేసింది. అయితే సేవలను మాత్రం రైతులకు పూర్తిగా దూరం చేసేసింది. గత ప్రభుత్వం తీసుకువచ్చిందనే కారణంతోనే ఆయా కేంద్రాలను నిర్వీర్యం చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయితీ విత్తనాలు, ఎరువులను సకాలంలో పంపిణీ చేయకుండా వేధిస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 442 రైతు సేవాకేంద్రాల్లో కేవలం 340 మంది మాత్రమే అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు పనిచేస్తున్నారని వాపోతున్నారు. దీంతో భూసార పరీక్షలు సక్రమంగా చేసే పరిస్థితి కనిపించడం లేదని వెల్లడిస్తున్నారు. అలాగే సాగులో వినూత్న విధానాలపై సలహాలు అందించేవారే కరువయ్యారని ఆరోపిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో దాదాపు 55శాతం ఆర్‌బీకేలకు సొంత భవనాలు నిర్మించారని, అయితే కూటమి పాలనలో మాత్రం పూర్తిగా విస్మరించారని మండిపడుతున్నారు. అన్నదాతా సుఖీభవ పథకం కింద పెట్టుబడి సాయంగా రూ.20వేల చొప్పున అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించి గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు రైతు సేవాకేంద్రాలను సైతం తమకు దూరం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. క్లస్టర్ల కింద రేషనలైజేషన్‌ పేరుతో ఆర్‌ఎస్‌కేలను తగ్గించి సేవలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

● అలంకారప్రాయంగా రైతు సేవా కేంద్రాలు ● రేషనలైజేషన్‌ పేర1
1/1

● అలంకారప్రాయంగా రైతు సేవా కేంద్రాలు ● రేషనలైజేషన్‌ పేర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement