నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రా ఫాస్ట్‌ సిమెంట్‌ | - | Sakshi
Sakshi News home page

నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రా ఫాస్ట్‌ సిమెంట్‌

May 24 2025 12:45 AM | Updated on May 24 2025 12:45 AM

నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రా ఫాస్ట్‌

నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రా ఫాస్ట్‌

తిరుపతి రూరల్‌ : వినియోగదారుల నమ్మకానికి, గోడల దృఢత్వానికి ప్రతీకగా భారతి అల్ట్రా ఫాస్ట్‌ సిమెంటు నిలుస్తుందని ఆ సంస్థ టెక్నికల్‌ మేనేజర్‌ సి.ఛాయాపతి తెలిపారు. శుక్రవారం తిరుపతి రూరల్‌ మండలం చెర్లోపల్లెలోని శ్రీసాయితేజ స్టీల్‌ అండ్‌ సిమెంట్‌ అధినేత కృష్ణమూర్తి ఆధ్వర్యంలో తాపీ మేసీ్త్రలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఛాయాపతి మాట్లాడుతూ జర్మన్‌ టెక్నాలజీ, రోబోటెక్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఇంజినీరింగ్‌ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భారతి అల్ట్రాఫాస్ట్‌ సిమెంటును ఉత్పత్తి చేస్తున్నట్టు వెల్లడించారు. ట్యాంపర్‌ ప్రూఫ్‌ బస్తాలతో మార్కెట్‌లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవకాశం కూడా ఉండదన్నారు. సిమెంట్‌ రంగంలో భారతి సిమెంటు అగ్రగామిగా నిలిచిందని చెప్పారు. అనంతరం భారతి సిమెంట్‌కు సంబంధించిన నాణ్యతా ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. భారతి అల్ట్రాఫాస్ట్‌ సిమెంటు తయారవుతున్న విధానం, భవన నిర్మాణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలను క్షుణ్ణంగా వివరించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం భారతి సిమెంట్‌ ప్రతిచోటా అందుబాటులో ఉండేలా డీలర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతరం మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలను అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement