
రోడ్డు ఆక్రమణకు యత్నం
– అడ్డుకున్న ఆర్అండ్బీ అధికారులు
రేణిగుంట: మండల పరిధిలోని పాపానాయుడుపేట–రేణిగుంట ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఎల్లమండ్యం రెవెన్యూ లెక్కదాఖలాలో సర్వేనంబర్ 263/9సి/ 1లో గల భూమికి సంబంధించి పత్రాలు ఉన్నాయని కొందరు వ్యక్తులు ప్రహరీ నిర్మాణం చేపడుతుండడంపై స్థానికులు ఆర్అండ్బీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆర్అండ్బీ వర్క్ ఇన్స్పెక్టర్ మురుగయ్యనాయుడు గురువా రం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రహరీ గోడ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. గతంలో పిల్లర్లు వేసినప్పుడు కూడా నిలుపుదల చేశామని..అయినా కూడా రోడ్డుపై రాయి నాటారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్అండ్బీ, ఎన్హెచ్ఏ, రెవెన్యూ సర్వేయర్లు వచ్చి సర్వే చేశాకే పనులు చేసుకోవాలని లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి లీగల్గా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.