హైదరాబాద్: వచ్చే నెల 1వ తేదీ నాటికి ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 900 కోట్లు విడుదల చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేటు కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య హెచ్చరించింది. ఒకవేళ బకాయిలను విడుదల చేయకపోతే నవంబర్ 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్ చేస్తామని ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చైర్మన్ రమేష్ బాబు స్పష్టం చేశారు. ఈ మేరకు జనరల్ బాడీ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు.
నవంబర్ 1 లోపు రూ. 900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి
లేదంటే నవంబర్ 3 నుంచి ఉన్నత విద్యా సంస్థల నిరవధిక బంద్
అన్ని వృత్తి విద్యా కళాశాలలు, డిగ్రీ ,పీజీ కాలేజీలు నిరవదిక బంద్ చేస్తాం..
హామీ ఇచ్చి మళ్ళీ నెరవేర్చక పోతే మార్చి , ఏప్రిల్ లో జరిగే ఫైనల్ పరీక్షలు కూడా బాయ్ కాట్ చేస్తాం.
2024-25 విద్యా సంవత్సరం వరకు పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం ఒక కాలపరిమితి గల రోడ్మ్యాప్ను ప్రకటించాలి
2026 జూన్ నాటికి పూర్తి చెల్లింపు జరిగేలా చేయాలి
ప్రస్తుత సంవత్సరం 2025-26 బకాయిలు సకాలంలో విడుదల చేయాలి
ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే బంద్ లో రోజుకో నిరసన
హైదరాబాద్ లో అధ్యాపకులతో కలిసి భారీ బహిరంగ సభ
10 లక్షల మంది విద్యార్థులను హైదరాబాద్ తీసుకొచ్చి నిరసన
నవంబర్ 1 నాటికి పెండింగ్ బకాయిలు చెల్లిస్తారని ఆశిస్తున్నాం
బెదిరింపులకు భయపడి ఈసారి వెనక్కి తగ్గేది లేదు
బకాయిలు అడిగితేనే విజిలెన్స్ తనిఖీలు గుర్తుకు వస్తున్నాయి


