సంగారెడ్డిలో వ్యక్తి గల్లంతు.. | One Person Missed Due To Heavy Rains In Sangareddy | Sakshi
Sakshi News home page

సంగారెడ్డిలో వ్యక్తి గల్లంతు..

Sep 26 2020 9:58 PM | Updated on Sep 26 2020 10:13 PM

One Person Missed Due To Heavy Rains In Sangareddy - Sakshi

ఫైల్‌ ఫోటో

సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో భారీ వర్షలు నమోదవుతున్నాయి. భారీ వర్షాలకు రోడ్లు దాటుతున్న ముగ్గరు వ్యక్తులు గల్లంతయ్యారు. అయితే గ్రామస్తులు ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు చేర్చారు. కంగ్టి మండలం జంగి బి కి చెందిన 55 ఏళ్ల మంగలి మారుతి శనివారం మధ్యాహ్నం కాకి వాగు వరద ఉధృతిలో గల్లంతయ్యాడు. జంగికెకు వెళ్లే రహదారిలో మంగలి మారుతి కల్వర్టు దాటుతుండగా కాకి వాగు ఉధృతి ప్రవాహం పెరిగింది. రాత్రి నుండి  భారీ వర్షం కురుస్తుండడంతో కాకి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కాగా ప్రవాహం పెరగడంతో స్థానికులు కల్వర్టు సమీపంలోనే ఉండిపోయారు.  కానీ మంగలి మారుతి మాత్రం కల్వర్టు దాటి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయగా, వాగులో కొట్టుకుపోయి గల్లంతయ్యాడని స్థానికులు తెలిపారు. మారుతి ఆచూకీ కోసం మండల రెవెన్యూ అధికారులు(ఎమ్మార్వో) సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement