తెలంగాణలో కొత్తగా 2,524 కరోనా కేసులు

New Coronavirus Cases Recorded Telangana 31 May - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతోంది. గత 24 గంటల్లో 87,110 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,524 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. కోవిడ్ బాధితుల్లో 18 మంది మ‌ర‌ణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,464 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,40,986 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 34,084 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1,51,76,159 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్‌ బాధితుల్లో 3,281 మంది మృతి చెందారు. 

చదవండి: అలర్ట్‌: హైదరాబాద్ మెట్రో కొత్త టైమింగ్స్‌ ఇవే

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top