తెలంగాణలో కొత్తగా 2,524 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 87,110 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 2,524 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 18 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 3,464 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,40,986 మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 34,084 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 1,51,76,159 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బాధితుల్లో 3,281 మంది మృతి చెందారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు