Woman Stage Protest Outside Lover's House In Warangal - Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ఎదుట దీక్ష

Jul 4 2021 12:27 PM | Updated on Jul 4 2021 3:30 PM

Man Elude Girl In Warangal - Sakshi

దీక్ష చేస్తున్న పవిత్ర

సాక్షి, చెన్నారావుపేట(వరంగల్‌): ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తూ యువతి ప్రియుడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లిలో శనివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. ఉప్పరపల్లికి చెందిన ఆరెళ్లి కిరణ్‌ ప్రైవేట్‌ ఉద్యోగి.. అతడి సోదరుడు వరంగల్‌ కీర్తినగర్‌ కాలనీలో నివాసం ఉంటుండగా, అదే కాలనీకి చెందిన కుక్కముడి పవిత్రతో కిరణ్‌కు ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో అతడు పని చేసే ములుగు, మిర్యాలకూడ, వరంగల్, హన్మకొండతో పాటు పలు ప్రాంతాల్లో సహజీవనం చేశారు.

ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని పవిత్ర కిరణ్‌ను కోరడంతో కులాలు వేరని, నిన్ను పెళ్లి చేసుకుంటే ఊళ్లో పరువు పోతుందని, మా అమ్మానాన్న చనిపోతామని అంటున్నారని దాటవేశాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న పవిత్ర ఉప్పరపల్లిలోని కిరణ్‌ ఇంటి ఎదుట పెళ్లి చేసుకోవాలని దీక్షకు దిగింది. కాగా, యువతి దీక్షకు ఎంఎస్‌ఎఫ్‌ ఇన్‌చార్జ్‌ రాజశేఖర్‌ మద్దతు తెలిపారు. పెళ్లి పేరుతో మోసం చేసిన కిరణ్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు, అన్నా, వదినపై అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. పవిత్రకు న్యాయం జరిగే వరకు ఎమ్మార్సీఎస్, ఎంఎస్‌ఎఫ్‌ సంఘాలు మద్దతుగా ఉంటాయని అన్నారు. 

చదవండి: టీ సర్కార్‌ ఉల్లంఘనలపై తెలంగాణ హైకోర్టుకు ఏపీ రైతులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement