రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా | Second Phase Of Telangana Gram Panchayat Elections 2025 Polling On Dec 14th Live Updates And Highlights Telugu | Sakshi
Sakshi News home page

Live Updates

Cricker

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా

కరీంనగర్ జిల్లా: పోలంపల్లిలో ఉద్రిక్తత

  • తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో ఉద్రిక్తత
  • సర్పంచ్ ఎన్నికల్లో మూడు ఓట్లతో గెలుపొందిన గుంటి లావణ్య
  • రీ కౌంటింగ్ పెట్టించిన అపోజిషన్ అభ్యర్థి
  • రీ కౌంటింగ్ లో ఐదు ఓట్లు వచ్చి మళ్లీ గెలుపొందిన లావణ్య
  • ఒకసారి మూడు ఓట్లు, మరోసారి ఐదు ఓట్లు ఎలా వస్తాయని ఎన్నికల అధికారులు నిలదీసిన ప్రత్యర్థి అభ్యర్థి
  • పోలింగ్ కేంద్రం వద్ద గొడవ.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
  • పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్న కమిషనర్ గౌస్ ఆలం
  • గుంటి లావణ్య 3 ఓట్లతో గెల్చినట్లు ప్రకటించిన అధికారులు
  • ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు
2025-12-14 21:43:28

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫలితాలు ఇలా..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా:


పెద్దపల్లి జిల్లా ( 60/ 73)

కాంగ్రెస్ -  36

బీఆర్ఎస్- 11

బీజేపీ - 01

ఇతరులు - 12

కరీంనగర్ జిల్లా( 72/113)

కాంగ్రెస్- 26

బీఆర్ఎస్ -28

బీజేపీ -08

ఇతరులు - 09

రాజన్న సిరిసిల్ల ( 77/88)

కాంగ్రెస్ - 34

బీఆర్ఎస్ - 25

బీజేపీ-04

ఇతరులు -14

జగిత్యాల జిల్లా (110/144)

కాంగ్రెస్ - 76

బీఆర్ఎస్ -12

బీజేపీ - 10

ఇతరులు - 12

2025-12-14 21:25:34

కామారెడ్డి జిల్లా

  • ఎల్లారెడ్డి మండలంలో 31 గ్రామపంచాయతీలకు గాను 25 కాంగ్రెస్, బీఆర్ఎస్ 05 , స్వతంత్రులు ఒక్కరు గెలుపొందారు.

  • నాగిరెడ్డి పేట్ మండలంలో 20 గ్రామపంచాయతీలకు గాను కాంగ్రెస్ 08,బీఆర్‌ఎస్‌ 05, బీజేపీ 01 , 06 స్వాతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

  • లింగంపేట మండలంలో 27 గ్రామపంచాయతీలకు గాను 18 కాంగ్రెస్, 04 బీఆర్‌ఎస్‌, 02 బీజేపీ, 03 స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు.

2025-12-14 21:13:11

నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ శ్రేణుల ధర్నా

నల్గొండ జిల్లా:

  • వేములపల్లి మండలం ఇసుకబాయి గూడెంలో బిఆర్ఎస్ వర్గీయుల ధర్నా

  • కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థికి ఆర్వో సపోర్ట్ చేసి మూడు దొంగ ఓట్లు వేయించారని ఆరోపణ

  • ఒక్క ఓటుతో ఓడిపోయినట్లు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థితో ఆర్వో సంతకాలు తీసుకున్నారని ఆందోళన

  • ఎన్నికల నిర్వహణ ఉన్నతాధికారులు వచ్చి న్యాయం చేయాలని డిమాండ్

2025-12-14 21:13:11

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దూకుడు

పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దూకుడు

కాంగ్రెస్‌- 1705

బీఆర్‌ఎస్‌- 889

బీజేపీ- 197

ఇతరులు-475

2025-12-14 20:07:26

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :

అన్నపురెడ్డిపల్లి..10 పంచాయతీలు
సిపిఐ-1 
కాంగ్రెస్- 01
బిఆర్ఎస్- 01
ఇండిపెండెంట్... 01

అశ్వారావుపేట-27పంచాయతీలు
బిఆర్ఎస్- 08
కాంగ్రెస్- 08
సిపిఎం- 01
సిపిఐ ఎంఎల్ ఎన్డి- 01
ఇండిపెండెంట్-01

ములకలపల్లి-20పంచాయతీలు
బిఆర్ఎస్- 05
కాంగ్రెస్-01
సిపిఐ ఎంఎల్ ఎన్డి- 01
ఇండిపెండెంట్- 02

చండ్రుగొండ-14 పంచాయతీలు
బిఆర్ఎస్- 02
కాంగ్రెస్-05
సిపిఐ-01

దమ్మపేట-31పంచాయతీలు
బిఆర్ఎస్-06
కాంగ్రెస-13
సిపిఐ ఎంఎల్ ఎన్డి- 01

చుంచుపల్లి-18 పంచాయతీలు
సిపిఐ- 06
కాంగ్రెస్-03
బిఆర్ఎస్-02

పాల్వంచ-36 పంచాయతీలు
సిపిఐ- 12
కాంగ్రెస్- 08
సిపిఎం-  02
బిఆర్ఎస్-  02
ఇండిపెండెంట్-02

2025-12-14 19:40:04

జగిత్యాల జిల్లాలో రీకౌంటింగ్‌

జగిత్యాల జిల్లా:

  • రాయికల్ మండలం బోర్నపెల్లిలో రీ కౌంటింగ్
  • బోర్నపెల్లిలో బరిలో ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు
  • కౌంటింగ్ హాల్లో  ముగ్గురు  సర్పంచ్ అభ్యర్థులు లేకపోవడంతో కౌంటింగ్ హల్ ఎదుట రీకౌంటింగ్ చేపట్టాలని గ్రామస్థుల నిరసన
  • కేవలం పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ నిర్వహించిన అధికారులు
  • ఏజెంట్ల సమక్షంలో  ఒక  అభ్యర్థి  85 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గా గెలిచినట్టు ప్రకటించిన  అధికారులు
  • నిరసనల నేపథ్యంలో రీకౌంటింగ్ చేపట్టిన అధికారులు
2025-12-14 19:35:26

గెలుపొందిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు వీరే

నల్లగొండ జిల్లా:

  • గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు
  • మిర్యాలగూడ మండలం 
  • బాధలపురం గ్రామంలో (బిఆర్ఎస్ గుడ్డెన బోయిన అలివేలు )
  • ముల్కలు కాల్వ గ్రామం ( కాంగ్రెస్ కుండా జ్యోతి)
  • బల్లు నాయక్ తండ (బిఆర్ఎస్ కమ్లి)
  • టికెట్ తండా (స్వతంత్ర అభ్యర్థి )
  • గోపసముద్రం తండ (సిపిఎం రవి నాయక్)
  • సీతయ్య తండా గ్రామం (ధనవతులక్ష్మి కాంగ్రెస్)
  • దుబ్బ తండ -శ్రీనివాస్ నగర్ ( కాంగ్రెస్ రెబల్ ధరావత్ దాలి)
  • కొత్తపేట గ్రామం (కాంగ్రెస్ 232 ఓట్లతో గెలుపు లావూరి నీలమ్మ బోజ్జ)
2025-12-14 18:30:18

టాస్‌తో వరించిన విజయం

కామారెడ్డి జిల్లా:

  • టాస్‌తో గెలుపొందిన అడవి లింగాల్ సర్పంచ్ మంగలి సంతోష్ 
  • ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల గ్రామ సర్పంచులుగా పోటీ చేసిన మంగలి సంతోష్ కుమార్ పెంట మానయ్యా 
  • ఇద్దరికీ 483 ఓట్లు సమాన ఓట్లు రావడంతో అధికారులు టాస్ వేయడంతో మంగలి సంతోష్ కుమార్ గెలుపొందినట్లు సమాచారం 
2025-12-14 18:24:26

పెద్దపల్లి జిల్లాలో..

పెద్దపల్లి జిల్లా: 

  • పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం  రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌ల జాబితా

  • జూలపల్లి మండలం

  • 1, కీచులాటపల్లి, మెండే తిరుపతి బీఆర్ఎస్ గెలుపు 

  • 2, బాలరాజుపల్లి,  కుంటూరి అంజమ్మ బీఆర్ఎస్ గెలుపు 

  • 3, నాగులపల్లి, పొలవేన లత బీఆర్ఎస్ గెలుపు 

  • 4, చీమల పేట, లంక స్వామి, బీఆర్ఎస్ గెలుపు 

  • 5, కొండ్రావుపేట, నల్ల నరేందర్ రెడ్డి, బీజేపీ గెలుపు 

  • 6, పెద్దాపూర్, తొగరి శ్రీనివాస్,బీఆర్ఎస్ గెలుపు 

  • 7, వెంకట్రావుపల్లి, మచ్చ అరుణ, బీఆర్ఎస్ గెలుపు

2025-12-14 18:20:42

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ హవా 

2025-12-14 17:33:47

వికారాబాద్ జిల్లాలో..

వికారాబాద్ జిల్లా:

  • వికారాబాద్ మండలం అత్వెల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి విజయలక్ష్మి వెయ్యికి పైగా ఓట్లతో గెలుపు
  • వికారాబాద్ మండలం పెండ్లి మడుగులో బిజెపి అభ్యర్థి పెద్ద సంతోష గెలుపు
  • వికారాబాద్ బురాంతపల్లి గ్రామ సర్పంచ్ గా రాందాస్  నాయక్ గెలుపు.
  • మర్పల్లి మండలం గుర్రం గాడ్ తండాలో కాంగ్రెస్ అభ్యర్థి మెగావత్ రాజు స్వల్ప మెజార్టీ విజయం
  • మర్పల్లి మండలం రామాపూర్ నూతన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఒకే ఒక ఓట్ తో కాంగ్రెస్ అభ్యర్థి రమాదేవి విజయం
  • ధరూర్ మండలం అల్లాపూర్ గ్రామ సర్పంచిగా విజయలక్ష్మి ఎన్నిక. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి
2025-12-14 16:51:16

కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి జిల్లా: 

  • ఎల్లారెడ్డి మండలం సోమరిపేట గ్రామ సర్పంచ్‌ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కురుమ పాపయ్య 47 ఓట్లతో గెలుపొందారు 
  • పిట్లం మండలం సిద్దాపూర్   సర్పంచ్‌గా  కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్ధి నక్క సునీత 211 మెజారిటీతో గెలుపు
2025-12-14 16:51:16

ఖమ్మం జిల్లాలో..

ఖమ్మం జిల్లా:

  •  కూసుమంచి మండలం తురుగూడెం కృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 195 ఓట్లతో గెలుపు 
  • లింగారం తండా కాంగ్రెస్ బానోతు రవి 33 ఓట్లతో మెజార్టీ 
  • ధర్మా తండా కాంగ్రెస్ కళ్యాణి 48 ఓట్లతో గెలుపు
2025-12-14 16:51:16

మామపై కోడలు గెలుపు

జగిత్యాల జిల్లా

  • మామపై కోడలు గెలుపు..
  • రాయికల్ మండలం శ్రీరామ్ నగర్  గ్రామంలో మామ తాళ్లపల్లి సత్యనారాయణపై.. కోడలు రాధిక 14 ఓట్లతో విజయం
2025-12-14 16:51:16

నిజామాబాద్ జిల్లాలో

నిజామాబాద్ జిల్లా :

  • డిచ్‌పల్లి మండలం దేవ నగర్ క్యాంప్ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపర్చిన యూసుఫ్ విజయం సాధించారు

నిజామాబాద్ జిల్లా :

  • ధర్పల్లి మండలం ఎస్ బీ తండా కాంగ్రెస్ అభ్యర్థి  రమావత్ రమేష్ 41 ఓట్ల మెజారిటీతో గెలుపు..
  • నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ముల్లంగి ఐ గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ అభ్యర్థి సుదాం శ్రీనివాస్ 408 ఓట్ల తేడాతో విజయం సాధించారు
  • నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని జగదాంబ తండాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మలవత్ సుగుణ 40 ఓట్లతో గెలుపు
2025-12-14 16:18:44

ఖమ్మంలో

ఖమ్మం: కామేపల్లి మండలం పొన్నెకల్లు కాంగ్రెస్ అభ్యర్థి భూమిక 603 ఓట్ల తో గెలుపు

2025-12-14 16:00:02

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..

  • తంగళ్ళపల్లి మండలం లోని పలు గ్రామపంచాయతీలో వెలువడిన సర్పంచ్ ఎన్నిక ఫలితాలు
  • పాపయ్య పల్లె సర్పంచిగా చెన్నమనేని పరశురాములు (బిఆర్ఎస్)
  • ఇందిరానగర్ చిట్యాల దేవేందర్ అలియాస్ వెంకన్న  (కాంగ్రెస్)
  • మల్లాపూర్ వెన్నమనేని లావణ్య (బిఆర్ఎస్) పార్టీ విజయం 
2025-12-14 16:00:02

నిజామాబాద్‌లో..

  • నిజామాబాద్ : ఇందల్వాయి మండలం శ్దేవీ తండాలో  స్వతంత్ర అభ్యర్థి భదవత్ గణేష్ 58 ఓట్లతో విజయం 
  • నిజామాబాద్ : డిచ్‌పల్లి మండలం సాంపల్లి తాండలో కాంగ్రెస్ బల పరచిన అభ్యర్థ రాథోడ్ మమత విజయం 
  • నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గడ్డమీద తండాలో కాంగ్రెస్ అభ్యర్థి కేతవత్ రామ్ సింగ్ గెలుపు
2025-12-14 16:00:02

బోణి కొట్టిన బీఆర్ఎస్

పెద్దపల్లి జిల్లా: ధర్మారం మండలంలో బోణి కొట్టిన బీఆర్ఎస్

రామయ్యపల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మల్లేష్ గౌడ్  విజయం

2025-12-14 15:45:55

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైన కౌంటింగ్‌

  • ప్రారంభమైన రెండో విడత ఎన్నికల కౌంటింగ్..
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 418 స్థానాల్లో మొదలైన కౌంటింగ్ ప్రక్రియ..
  • మొదట వెల్లడి కానున్న వార్డు మెంబర్స్ ఫలితాలు
  • సాయంత్రం నాల్గు గంటల వరకు రానున్న చిన్న పంచాయతీల ఫలితాలు
  • రాత్రి వరకు వెల్లడి కానున్న మేజర్ గ్రామపంచాయతీల ఫలితాలు
2025-12-14 15:09:29

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముగిసిన పోలింగ్‌

  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ముగిసే సమయానికి నమోదైన పోలింగ్ శాతం 
  • కరీంనగర్ జిల్లా- 84.63
  • జగిత్యాల జిల్లా - 74.0
  • పెద్దపెల్లి జిల్లా -80.84
  • రాజన్న సిరిసిల్ల జిల్లా- 80.78
2025-12-14 14:47:59

కామారెడ్డి జిల్లా..

కామారెడ్డి జిల్లా..

  • ఎల్లారెడ్డి డివిజన్ రెండో విడత లో ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు 
  • నాలుగు మండలల్లో పూర్తి అయిన పోలింగ్ 
  • గాంధారి మండలం 73.23 % శాతం
  • లింగంపేట్ మండలం 82.20 % శాతం

నాగిరెడ్డిపేట్ మండలం:

  • 85.88 % శాతం
  • ఎల్లారెడ్డి మండలం  87.81 % శాతం
  • పోలింగ్ నమోదు అయినట్లు తెలిపిన అధికారులు...
  • కాసేపట్లో కౌంటింగ్ కి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు...
  • ఫలితాలపై అభ్యర్థుల్లో నెలకొన్న ఉత్కంట 
2025-12-14 14:47:59

రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం

  • రెండో విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం
2025-12-14 14:19:40

మధ్యాహ్నం ఒంటి గంటకు ..

పోలింగ్‌ ముగిసే సమయానికి పలు జిల్లాల్లో పోలింగ్‌ శాతం ఇలా..

  • వనపర్తి జిల్లాలో రెండో విడత పోలింగ్ 83.9%
    మహబూబ్ నగర్ జిల్లాలో 79.2% పోలింగ్
  • యాదాద్రి భువనగిరి జిల్లా
    రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో 82.53 శాతం పోలింగ్ నమోదు
  • నల్లగొండ జిల్లా
    రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో 82.74 శాతం పోలింగ్ నమోదు
  • సూర్యాపేట జిల్లా:
    సూర్యాపేట జిల్లా లో  రెండవ విడత  గ్రామ పంచాయతీ ఎన్నికలలో  (ఉదయం 9 గంటల నుండి 1 గంటల వరకు ) మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు
  • మోతె --84.05  %
  • చివ్వెంల .90.07  %
  • మునగాల....87.48  %
  • నడిగూడెం... 85.40 %
  • పెనుపహాడ్..88.03  %        
  • కోదాడ... 86.09   %
  • అనంతగిరి.. 89.79  %            
  • చిలుకూరు..83.05 %          
  • జిల్లాలో పోలింగ్ సరాసరి..  86.78 %
2025-12-14 13:51:48

గ్రామ సర్పంచ్ అభ్యర్థి భర్త అదృశ్యం

మెదక్ జిల్లా:

  • చేగుంట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి భర్త అదృశ్యం
  • తాను డబ్బు మద్యం పంపిణీ చేసిన ఓడిపోతామనే భయంతో రాత్రి నుండి కనిపించకుండా పోయిన చేర్యాల జనార్దన్ రెడ్డి
  • గ్రామంలో ఉదృతత ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన డిఎస్పి నరేందర్ గౌడ్
  • డ్రోన్ కెమెరాలు గాలింపు చర్యలు చేపట్టి చేర్యాల జనార్దన్ రెడ్డిని పట్టుకున్న పోలీసులు
2025-12-14 13:46:03

ముగిసిన రెండో విడత పోలింగ్‌

  • ముగిసిన పోలింగ్‌
  • క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం
  • మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్‌ ప్రారంభం
  • భారీగా పెరిగిన పోలింగ్ శాతం
  • ఆదివారం సెలవు రోజు కావడంతో భారీగా తరలివచ్చిన ఓటర్లు
  •  హైదరాబాద్ - చేవెళ్ల, హైదరాబాద్ - శంకర్ పల్లి రూట్లలో భారీగా ట్రాఫిక్ జామ్
2025-12-14 13:04:43

మావలలో గ్రామస్తుల ఆందోళప

ఆదిలాబాద్‌

  • మావలలో గ్రామస్తుల ఆందోళప
  • మా ఓట్లు గల్లంతయ్యాయని నిరసన
  • ఆర్డీవోకు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
     
2025-12-14 13:02:40

నేలకొండపల్లి మండలం ఆరెగూడెంలో ఘర్షణ

ఖమ్మం:

  • పంచాయతీ ఎన్నికల ేనేపథ్యంలో రెండు వరర్గాల మధ్య ఘర్షణ
  • రెండు వర్గాల ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలు
2025-12-14 12:51:28

నేరెళ్ళపల్లిలో ఓటేసిన మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు

నాగర్ కర్నూల్ జిల్లా:

  • తిమ్మాజిపేట మండలం నేరెళ్ళపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు.
2025-12-14 12:41:46

పచ్చనూరు పోలింగ్‌ కేంద్రంలో

కరీంనగర్ జిల్లా:

  • మానకొండూరు మండలం పచ్చనూరులో తమ ఓటు హక్కు వినియోగించుకున్న మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దంపతులు
2025-12-14 11:59:36

బొగుడా గ్రామం పోలింగ్ కేంద్రంలో..

సంగారెడ్డి జిల్లా

  • రెండవ విడత సర్పంచ్ ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
  • వట్ పల్లి మండలం పోతుల బొగుడా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో  ఓటు వేసిన క్రాంతి కిరణ్
2025-12-14 11:58:24

ఉదయం 11 గంటల వరకూ..

భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం

  • కొత్తగూడెం జిల్లాలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11.00 గంటల వరకు  57.57 పోలింగ్  నమోదు

    ఖమ్మం జిల్లా
  • రెండవ విడత పంచాయతీ ఎన్నికలు
  • 11.00 గంటల వరకు పోలింగ్ శాతం - 64.32%

యాదాద్రి భువనగిరి జిల్లా:

  • రెండవ విడత 5 మండలాల్లో  ఉదయం 11 గంటల వరకు 56.51 శాతం పోలింగ్ నమోదు
  • వలిగొండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో  కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

నల్లగొండ జిల్లా

  • రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 56.44 శాతం పోలింగ్ నమోదు

సంగారెడ్డి జిల్లా 

  • మునిపల్లి (మం) కంకోల్ టోల్ గేట్ వద్ద NH 65పై భారీగా ట్రాఫిక్ జామ్
  • కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
  • టోల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు

కరీంనగర్ జిల్లా

  • జిల్లా వ్యాప్తంగా  ఉదయం 11 గంటల వరకు  నమోదైన పోలింగ్ శాతం.. 56.43
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలింగ్ శాతం 51. 14
  • పెద్దపెల్లి జిల్లాలో 55. 20

జగిత్యాల జిల్లాలో 51. 77శాతం నమోదు.

సూర్యాపేట జిల్లా

  • రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 60.07 శాతం పోలింగ్ నమోదు
     
2025-12-14 11:54:11

‘విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు’

నల్లగొండ జిల్లా:

  • సాక్షి టీవీతో నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్
  • నల్లగొండలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది
  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాం
  • పోలింగ్ సందర్భంగా ఎవరైనా గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠినంగా చర్యలు ఉంటాయి
  • కౌంటింగ్ అనంతరం ఎలాంటి విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
2025-12-14 11:51:11

ఖమ్మం జిల్లాలో విషాదం.. సర్పంచ్‌ అభ్యర్థి మృతి

  • ఖమ్మం జిల్లాలో సర్పంచ్‌ అభ్యర్థి నాగరాజు మృతి
  • అనాసాగర్‌ సర్పంచ్‌ అభ్యర్థి నాగరాజు బ్రెయిన్‌ డెడ్‌
  • ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన నాగరాజు
2025-12-14 10:49:55

కొనాయిపల్లిలో ఉద్రిక్తత

మెదక్‌:

  • కొనాయిపల్లిలో  ఉద్రిక్తత
  • పంచాయతీ ఎన్నికల్లో ఇరువర్గాల ఘర్షణ
  • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
2025-12-14 10:42:27

ఓటర్లను ఆకట్టుకునేలా హరిత(గ్రీన్ మోడల్‌ పోలింగ్‌ కేంద్రాలు

వరంగల్ జిల్లా :

  • నర్సంపేట నియోజకవర్గంలో రెండవ విడుత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో భాగంగా దుగ్గొండి(మం) వెంకటాపూర్, దేశాయి పల్లి, నల్లబెల్లి(మం) నల్లబెల్లి, నందిగామ ఉన్నత పాఠశాలల్లో ఓటర్లను ఆకట్టుకునేలా హరిత(గ్రీన్ మోడల్) పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన అధికారులు.
2025-12-14 09:59:21

తిప్పర్తి ఎంపీడీవో సుధాకర్ పై చర్యలు

నల్లగొండ జిల్లా: 

  • తిప్పర్తి ఎంపీడీవో సుధాకర్ పై చర్యలు
  • ఎన్నికల విధుల్లో అలసత్వం వహించడంతో పంచాయతీ రాజ్ కమిషనరేట్‌క సరెండర్ చేస్తూ ఉత్తర్వులు
  • ఎన్నికల లెక్కింపు, పోలింగ్, ఏర్పాట్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని‌ ఎంపీడోవో ఆరోపణలు
2025-12-14 09:54:53

ఉదయం గం. 9 వరకూ..

నిజమాబాద్ 
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉదయం 9.00 గంటల సమయానికి 20.49 శాతం పోలింగ్ నమోదు.

సూర్యాపేట జిల్లా
రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 25. 18 శాతం పోలింగ్ నమోదు

నల్లగొండ జిల్లా
రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 28.15 శాతం పోలింగ్ నమోదు
ఉదయం 9 గంటల వరకు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం.. 22.43 శాతం

కరీంనగర్ 
జిల్లా వ్యాప్తంగా నమోదైన ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం.. 22.43
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 20.27 శాతం
పెద్థపెల్లి 23.94 శాతం

సూర్యాపేట జిల్లా
రెండవ విడత  గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొదటి రెండు గంటలలో (ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు ) మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు

  • మోతె --27.37  %
  • చివ్వెంల ..26.66  %
  • మునగాల....27.03  %
  • నడిగూడెం... 21.51 %
  • పెనుపహాడ్..22.82  %        
  • కోదాడ... 24.58   %
  • అనంతగిరి.. 25.83  %            
  • చిలుకూరు..24.71  %          
  • జిల్లాలో పోలింగ్ సరాసరి..  25.18 %
2025-12-14 09:50:17

రెండో దశ ఎన్నికల్లో ఓటు వేసిన ఎమ్మెల్యేలు

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన స్వగ్రామం గండుగులపల్లి లోని పోలింగ్ కేంద్రంలో సాధారణ పౌరుడిగా ఓటర్ల తో కలిసి క్యూలైన్ లో నిలబడి వెళ్లి ఓటు వేశారు.
  • అటు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీ లోని 7 వ వార్డులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో  ఓటు వేశారు.
2025-12-14 09:48:33

అవంచలో ఉద్రిక్తత

  • నాగర్‌కర్నూల్‌: తిమ్మాజీపేట మండలం అవంచలో ఉద్రిక్తత
  • సర్పంచ్‌ ఎన్నికల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణ
  • ఇద్దరికి గాయాలు.. జడ్చర్ల ఆస్పత్రికి తరలింపు
2025-12-14 09:03:39

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల :

  • జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు
  • జగిత్యాల నియోజకవర్గంలో మొత్తం 101 గ్రామాలు
  • వీటిలో 9 గ్రామాలు ఏకగ్రీవంగా ఎంపిక..
  • మిగిలిన 92 గ్రామాలకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి..
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి పనిచేస్తూ జగిత్యాల ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వ్యాఖ్య..
  • నూటికి 90 శాతం వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుస్తారని విశ్వాసం..
2025-12-14 08:35:01

టవర్‌ ఎక్కిన సర్పంచ్‌ అభ్యర్థి

  • మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో టవర్ పైకి ఎక్కి నిరసన తెలుపుతున్న నర్సంపల్లి పెద్ద తండా సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న శంకర్ నాయక్ అనే వ్యక్తి
  • తనను ఓడించేందుకు ప్రత్యర్థికి ఓటుకు 2000 రూపాయలు పంపిణీ చేస్తున్నారని టవర్ పైకి ఎక్కి నిరసన
  • గతంలో తాను సర్పంచ్ గా పోటీ చేసి ఓడిపోయానని ఇప్పుడు కూడా తనను ఓడించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన
2025-12-14 08:32:29

కొనసాగుతున్న పోలింగ్‌

  • కొనసాగుతున్న రెండో విడత పోలింగ్‌
  • ఒంటి గంటవరకూ పోలింగ్‌
  • ఆపై ఓట్లక్కింపు

 

2025-12-14 07:46:34

మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్‌

  • పోలింగ్‌ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులను సీల్‌ వేసి మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు
  • ఆపై విజేతలప్రకటన
  • ఎన్నికల నిర్వహణలో ఎక్కడా లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌రాణి కుముదిని నిరంతరం పర్యవేక్షణ
2025-12-14 07:24:31

రెండో విడతలో... 

  • మొత్తం మండలాలు నోటిఫై: 193 
  • గ్రామ పంచాయతీలు నోటిఫై: 4,333 
  • వార్డులు నోటిఫై: 38,350 
  • పోలింగ్‌ స్టేషన్లు: 38,337 
  • రెండోదశలో ఓటర్ల సంఖ్య: 57,22,665 
  • పురుషులు: 27,96,006 
  • మహిళలు: 29,26,306 
  • ఇతరులు: 153 
  • పోలింగ్‌ జరగనున్న పంచాయతీలు: 3,911 
  • పోలింగ్‌ జరిగే వార్డులు: 22,917 
  • సర్పంచ్‌ అభ్యర్థులు: 12,782 
  • వార్డ్‌ మెంబర్‌ అభ్యర్థులు: 71,071 
  • ఆర్వోలు నియామకం: 30,661 
  • పోలింగ్‌ సిబ్బంది: 93,905 
  • మైక్రో ఆబ్జర్వర్లు: 2,489 (మూడు దశల ఎన్నికలకు) వెబ్‌కాస్టింగ్‌ కోసం గుర్తించిన పోలింగ్‌ స్టేషన్లు: 3,769 
  • బ్యాలెట్‌ బాక్సులు అందుబాటులో: 46,026 
     
2025-12-14 07:05:33

ఒక్కో సర్పంచ్‌ స్థానానికి సగటున 3–4 పోటీ 

  • రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో సర్పంచ్‌ పదవికి సగటున ముగ్గురు, నలుగురు బరిలో నిలవగా, వార్డు సభ్యస్థానాలకు సగటున ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్నారు.
  • మరోవైపు రెండోదశ ఎన్నికల వరకు రూ. 2.02 కోట్ల నగదు, రూ. 3.46 కోట్ల విలువైన మద్యం, రూ. 2.28 కోట్ల విలువైన డ్రగ్స్‌ సహా మొత్తంగా రూ. 8.59 కోట్ల విలువైన మొత్తాన్ని స్వా«దీనం చేసుకున్నట్లు ఎస్‌ఈసీ వెల్లడించింది. మొత్తం 3,675 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ముందుజాగ్రత్తగా 33,262 మందిని బైండోవర్‌ చేశామని తెలిపింది.  
2025-12-14 07:03:25

తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభం

  • తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికప్రారంభం
  • ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌
  • 3,911 సర్పంచ్‌ పదవులకు పోటీలో 12,782 మంది అభ్యర్థులు
  • 29,917 వార్డులకు బరిలో నిలిచిన 71,071 మంది అభ్యర్థులు
  • ఇప్పటికే 415 సర్పంచ్‌ స్థానాలు, 8,307 వార్డులు ఏకగ్రీవం
  • ఓటింగ్‌ పూర్తయ్యాక కౌంటింగ్‌.. విజేతల ప్రకటన
2025-12-14 07:01:32
Advertisement
 
Advertisement
Advertisement