Fire Accident At Warangal District | Manu Family Restaurant‌ - Sakshi
Sakshi News home page

Fire Accident: రెస్టారెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

May 27 2022 7:26 AM | Updated on May 27 2022 8:58 AM

Fire Accident At Warangal District - Sakshi

సాక్షి, వరంగల్‌: జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. చౌరస్తాలోని మను ఫ్యామిలీ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతున్నాయి. మంటల్లో రెస్టారెంట్‌ పూర్తి స్థాయిలో కాలిపోయినట్టు సమాచారం. 

వివరాల ప‍్రకారం షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాప్తి చెందినట్టు తెలుస్తోంది. రెస్టారెంట్ ముందు క్లాత్‌తో చేసిన డెకరేషన్‌కు మొదట మంటలు అంటుకోవడంతో క్లాత్ బోర్డ్ ఉండటం కారణంగా మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ మంటల్లో రెస్టారెంట్‌లో ఫర్నిచర్, సీలింగ్ దగ్ధమైంది. సమచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. రెస్టారెంట్ కింద ఉన్న బిగ్ సీ మొబైల్‌ షాప్‌లోకి మంటలు విస్తరించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కాగా, అగ్ని ప‍్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. 

ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement