తెలంగాణలో కొత్తగా 461 కరోనా కేసులు | 461 New Coronavirus Positive Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 461 కరోనా కేసులు

Jan 1 2021 8:44 AM | Updated on Jan 1 2021 8:55 AM

461 New Coronavirus Positive Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 42,013 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 461 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,86,815కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ముగ్గురు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 1544కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

నిన్న ఒక్క రోజే 617 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,79,456కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,815 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 3,674 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 69,24,707కి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement