
పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడిగా వీపీ రామలింగం
● జాన్కుమార్కు మంత్రి పదవి ● మరో ముగ్గురికి నామినేటెడ్ పదవులు
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి బీజేపీ అధ్యక్షుడిగా వీపీ రామలింగం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే పార్టీలో అసంతృప్తి ఎమ్మెల్యేగా ఉన్న జాన్కుమార్కు మంత్రి పదవి దక్కింది. మరో ముగ్గురికి నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులను కట్టబెట్టే దిశగా సిఫారసులు ఢిల్లీకి చేరాయి. 2021లో ఎన్ఆర్కాంగ్రెస్తో కలిసి ఎన్నికలలోకి వెళ్లిన బీజేపీ బ్రహ్మాండ విజయాన్ని దక్కించుకుంది. బీజేపీ – ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. ఎన్ఆర్కాంగ్రెస్ నేత రంగస్వామి సీఎంగా ఉన్నారు. అధికారంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. అయితే, గత వారం రోజులుగా పుదుచ్చేరి బీజేపీలో అనూహ్యమార్పులు జరుగుతూ వస్తున్నాయి. ఢిల్లీలోని పార్టీ అధినేతల నుంచి వచ్చిన సమాచారంతో తొలుత ముగ్గురు నామినేటెడ్ ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. క్షణాలలో వీరి రాజీనామాను స్పీకర్ ఎన్బలం సెల్వం ఆమోదించారు. మరుసటి రోజే శనివారం మంత్రి పదవికి బీజేపీ ఎమ్మెల్యే సాయి శరవణ కుమార్ రాజీనామా చేశారు. అదే సమయంలో ఆదివారం బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికకు ఎన్నికల నిర్వహించారు. ఇందులో పార్టీలో 2021లో చేరిన వీపీ రామలింగం అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్దాఖలు చేశారు. ఇతరులు ఎవ్వరు నామినేషన్ దాఖలు చేయనిదృష్ట్యా,ఆ యన ఎంపిక ఏక్రగీవమైంది. కొత్త అధ్యక్షుడిగా ఆయన జూలై 2వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.
జాన్కుమార్కు జాక్పాట్
బీజేపీలో ఆది నుంచి అసంతృప్తి ఎమ్మెల్యేగా జాన్కుమార్ వ్యవహరిస్తూ వచ్చారు. సాయి శరవణ కుమార్ రాజీనామాతో ఆయనకు తాజాగా అవకాశం కల్పించారు.
అసెంబ్లీ ఎన్నికలకు మరో పదినెలలు సమయం ఉన్న నేపథ్యంలో జాన్కుమార్కు మంత్రి పదవి కట్టబెట్టారు. అదే సమయంలో పార్టీకి చెందిన ముగ్గురు నేతలైన దీపయన్, సెల్వం, రాజశేఖర్లకు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవులు కట్ట బట్టే దిశగా అధిష్టానానికి సిఫారసులు వెళ్లాయి. కేంద్ర హోం శాఖ ఆమోదంతో వీరిని నామినేటెడ్ ఎమ్మెల్యేలుగా నియమించనున్నారు. ఇదిలా ఉండగా, బీజేపీలో సాగుతున్న పరిణామాల నేపథ్యంలో సీఎం రంగస్వామి వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. పూర్తిగా మంత్రి వర్గ పునర్ వ్యవస్తీకరణ దిశగా కసరత్తులలో ఉన్నట్టు సమాచారాాలు వెలువడ్డాయి. తమ పార్టీకి చెందిన పలువురు మంత్రులపై ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారిని తప్పించి అసంతృప్తితో ఉన్న వారికి పదవులు ఇచ్చే దిశగా వ్యూహాలకు పదును పెట్టినట్టు సమాచారం.
ఇందులో భాగంగా లెఫ్టినెంట్గవర్నర్ కై లాష్ నాథన్ను సీఎం రంగస్వామి కలవడం ప్రాధాన్యతకు దారి తీసింది. ఆయన సమయం ఇవ్వగానే మంత్రి వర్గ పునర్ వ్యవస్తీకరణ ప్రకటన, కొత్త వారి ప్రమాణ స్వీకారం ఒకే సమయంలో జరిగే దిశగా కసరత్తులు జరుగుతున్నాయి.