వైభవంగా గోమాతకు సీమంతం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా గోమాతకు సీమంతం

Jun 30 2025 4:03 AM | Updated on Jun 30 2025 4:03 AM

వైభవంగా గోమాతకు సీమంతం

వైభవంగా గోమాతకు సీమంతం

కొరుక్కుపేట: ఆవును పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు, సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంపదలు లభిస్తాయని నమ్ముతారు. గోమాతకు సీమంతం చేసి భక్తిని చాటుకున్న ఘటన చైన్నె నగరంలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయ గోశాలలో ఆదివారం జరిగింది. చైన్నెకు చెందిన గోమాత సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ కన్యకాపరమేశ్వరి గోశాలలోని రెండు గోవులకు సీమంతం చేశారు.గోవులకు పసుపు కుంకుమ రాసి,గాజులు తొడిగి ,జడపట్టి కట్టి , కొత్త వస్త్రాలు సమర్పించి గోప్రదక్షిణలు చే శారు.ఈ గోమాత సీమంతం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు, పెద్దలు, చిన్నారులు పాల్గొని గోమాత సేవలో తరించారు. గోమాత సేవ సంస్థ వ్యవస్థాపక సలహాదారులు అజంతా డాక్టర్‌ కనిగెలుపుల శంకర రావు ,వ్యవస్థాపకులు దయాళం పుష్పాంబ నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement