
క్లుప్తంగా
మినీ బజార్కు విశేష స్పందన
కొరుక్కుపేట: ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ (వామ్) గ్రేటర్ చైన్నె విభాగం, తమిళనాడు ఆర్యవైశ్య మహాసభ గ్రేటర్ చైన్నె సంయుక్త ఆధ్వర్యంలో చైన్నె చూలైమేడు, గిల్ నగర్ ఎక్స్టెన్షన్లోని శ్రీహరి నిలయంలో ఆదివారం నిర్వహించిన మినీ బజార్కు విశేష స్పందన లభించింది. వామ్ గ్లోబల్ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలను పోత్సహిచడమే కాకుండా మధ్యతరగతి కుటుంబాలకు అవకాశం కల్పించడమే ఈ మినీ బజార్ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. మినీబజార్లో వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, ఆభరణాలను ప్రదర్శనలో కొలువుదీర్చారు. మినీ బజార్కు వచ్చే సందర్శకులకు సిల్వర్ నుంచి డైమండ్ ఐటమ్స్ వరకు ప్రతి అరగంటకు ఒక లక్కీ డిప్ అందజేసినట్టు తెలిపారు. వామ్కు చెందిన సాయిచందన్, శ్రీహరి, బి.సాంబశివరావు, త్రినాథ్కుమార్, రాజశేఖర్, సుజాత పాల్గొన్నారు.
మహిళ హత్య
అన్నానగర్: సేలం జిల్లా సంగగిరికి చెందిన మణిమేగలై. మునిసిపాలిటీలో క్లీనర్గా పనిచేస్తున్న ఈమె కుటుంబ వివాదం కారణంగా భర్త నుంచి విడిపోయిన తర్వాత ఒంటరిగా నివసిస్తు వచ్చింది. ఈ స్థితిలో శనివారం సంగగిరి–తిరుచెంగోడు జంక్షన్ బ్రిడ్జ్ కింద మణిమేగలై రాయి దాడిలో హత్యకు గురైంది. సంగగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో సంగగిరి అక్కంపేటకి చెందిన అరుంధతియార్ వీధికి చెందిన కార్తీక్ (29)ను పోలీసులు అనుమానించారు. అతన్ని అరెస్టు చేసి విచారించినప్పుడు, అతను మణిమేగలైని హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.
బైకు – లారీ ఢీకొని
హెడ్ కానిస్టేబుల్ మృతి
అన్నానగర్: కృష్ణగిరి జిల్లా పోచ్చంపల్లి సమీపం మాథుర్ పోలీస్ స్టేషన్, స్పెషల్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మహాలింగం, హెడ్ కానిస్టేబుల్ జాస్మిన్ మిల్టన్ రాజ్ అలియాస్ మిల్టన్, 7వ స్క్వాడ్ శిక్షణ, పోచంపల్లి పే బెటాలియన్, శనివారం రాత్రి పెట్రోలింగ్ విధుల్లో ఉన్నారు. ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో, కోట్టూరు మారియమ్మన్ ఆలయంలో ఆడిట్ నిర్వహించి, పత్రాల పై సంతకం చేసిన తర్వాత, హెడ్ కానిస్టేబుల్ మిల్టన్, ట్రైనీ కానిస్టేబుల్ సుకుమార్ మాథుర్ ప్రాంతంలో ఆడిట్ నిర్వహించడానికి బైకుపై వెళ్లారు. వెనుక నుంచి వస్తున్న లారీ బైకు ను ఢీకొట్టింది. ఇందులో తీవ్రంగా గాయపడిన హెడ్ కానిస్టేబుల్ మిల్టన్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక ఉన్న ట్రైనీ కానిస్టేబుల్ సుకుమార్ కిందపడి గుంతలో పడి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష కోసం కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. ఇద్దరి లారీ డ్రైవర్లను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యాపారికి కత్తి చూపించి
బెదిరింపు
– నగలు నగదు, అపహరణ ఇద్దరు అరెస్టు
తిరువొత్తియూరు: దుకాణం యజమానికి కత్తిని చూపించి బెదిరింపులు ఇచ్చి నగదు నగలు అపహరించిన ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. కాంచీపురం జిల్లా మనిమంగళం సమీపము వరదరాజపురం ప్రాంతానికి చెందిన మనివన్నన్ ఇతను తాంబరం ముడిచూర్ లో టీ దుకాణం నడుపుతూ ఉన్నాడు. ఇతని దుకాణంలో గుడియాత్తంకు చెందిన ధనుష్ అనే అతను పనిచేస్తున్నాడు. టీ దుకాణంలో నష్టం రావడంతో మనివన్నన్ గత 3 నెలలకు క్రితం దుకాణమును మూసివేశారు. ఈ క్రమంలో మణివన్నన్ వరదరాజపురంలో ఉన్న అతని ఇంటిలో వున్న సమయంలో అక్కడికి వచ్చిన దుకాణంలో పని చేసిన ధనుష్, అతని స్నేహితుడు విగ్నేష్ మనివన్నన్ కు కత్తిని చూపించి బెదిరింపులు ఇచ్చి గూగుల్ పే మూలంగా రూ. లక్ష బీరువాలో ఉన్న 6 సవర్ల బంగారు నగలు తదితర వస్తువులను చోరీ చేసుకుని ఇద్దరు పారిపోయారు. దీని గురించి మనిమంగళం పోలీస్ స్టేషన్లో మనివన్నన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి క్రోమ్ పేటలో ఉన్న స్నేహితుని ఇంటిలో దాగి ఉన్న ధనుష్ ,విగ్నేష్ అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు వారి వద్ద నుంచి కత్తి, 6 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు.
హత్య కేసులో అత్త అరెస్టు
తిరువొత్తియూరు: ఆన్లైన్లో డెలివరీ ఉద్యోగి హత్య కేసులో అత్తను పోలీసులు అరెస్టు చేశారు. చైన్నె అశోక్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న కలయరసన్ (23) ఆన్లైన్ డెలివరీ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతని భార్య తమిళరసి కుటుంబ ఘర్షణతో భర్త నుంచి విడిపోయి తల్లితో ఉంటోంది. ఈక్రమంలో గత 15వ తేదీ హత్యకు గురయ్యాడు. పోలీసుల విచారణలో తమిళరసికి పులియందు తోపు ప్రాంతానికి చెందిన శరవనన్ వివాహతర సంబంధం ఉందని దీన్ని కలయరసన్ ఖండించడంతో అతను హత్య చేయబడినట్లు తెలియ వచ్చింది. ఈ కేసులో తమిళరసి సహోదరుడు రౌడీ శక్తి వేల్, మరో తమ్ముడు సంజయ్, స్నేహితుడు సునీల్ కుమార్, సంజయ్ సహా ఐదుగురిని పోలీస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో ఈ కేసులో సంబంధం వున్న తమిళ అరసి తల్లి సంధ్యను పోలీసులు శనివారం రాత్రి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న శరవనన్ కోసం పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు.