
25 నిమిషాలపాటు కర్రసాము
–యూనివర్సల్ అచీవర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం
తిరువళ్లూరు: విరామం లేకుండా 25 నిమిషాలపాటు రెండువందల మంది విద్యార్దులు కర్రసాము విన్యాసాలను ప్రదర్శించి యూనివర్శల్ అచీవర్ బుక్ ఆఫ్ రికార్డులో స్తానం సంపాదించారు. తిరువళ్లూరు జిల్లా తిరువూర్ సూపర్ కింగ్స్, తిరునిండ్రవూర్ నటరాజన్ క్లబ్ విద్యార్ధిని విద్యార్దులు కర్రసాము విన్యాసాలను ప్రదర్శించి యూనివర్శల్ ఆచీవర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కోసం ప్రయత్నం చేశారు. దాదాపు రెండు వంద మంది పాల్గోన్న కార్యక్రమంలో 25 నిమిషాల పాటు కర్రసాము స్టిక్కు రిబ్బన్ కట్టి విన్యాసాలను ప్రదర్శించారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన క్రమంలో వారికి రికార్డులో స్థానం దక్కింది. అనంతరం రికార్డులో స్థానం సంపాదించుకున్న సర్టిపికేట్ను కర్రసాము క్లబ్ నిర్వాహకులకు అందజేశారు. దీంతో పాలు కర్రసాము విన్యాసాలను ప్రదర్శించిన విద్యార్ధిని విద్యార్దులకు తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు అరుణన్, పూండి పారెస్ట్ అధికారి మునస్వామి, క్లబ్ నిర్వాహకుడు సుందర్ తదితరులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కోచ్లు జయరామన్, రాజా, గుణ,విజయ్ఆనంద్, మేనేజర్ లోకేశ్వరి, తిరునిండ్రవూర్ క్లబ్ అద్యక్షుడు నటరాజన్, మాజీ యూనియన్ కౌన్సిలర్ దిలిప్రాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు.