ఉగ్ర కావేరి! | - | Sakshi
Sakshi News home page

ఉగ్ర కావేరి!

Jun 29 2025 3:04 AM | Updated on Jun 29 2025 3:04 AM

ఉగ్ర కావేరి!

ఉగ్ర కావేరి!

సేలం: తమిళనాడులోనే డెల్టా జిల్లాలకు సాగుకు, ఇతర జిల్లాలకు ఉమ్మడి తాగు నీటి పథకానికి ప్రధాన వనరుగా మేట్టూరు జలాశయం నిలిచిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కురువై సాగుబడికి ఈ జలాశయం చేయూతను ఇచ్చింది. నిర్ణీత జూన్‌ 12వ తేదీన సాగునిమిత్తం గేట్లు తెరచుకున్నాయి. డెల్టా జిల్లాల వైపుగా కావేరి పరవళ్లుతొక్కుతున్నాయి. నిర్ణీత 120 అడుగులతో కూడిన ఈ జలాశయంలోకి శుక్రవారం నుంచి నీటి రాక మరింతగా పెరిగింది. సెకనుకు 75 వేలకు పైగా క్యూ సెక్కుల నీరు వస్తోంది. కర్ణాటకలో కురస్తున్న వర్షాలతో మళ్లీ కావేరిలోకి వరద ఉధృతి క్రమంగా పెరుగతున్నది. తమిళనాడు సరిహద్దులలోని పిలి గుండుల వద్ద సెకనుకు 90 వేల మేరకు క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. ఇది తమిళనాడు – కర్ణాటక సరిహద్దులలోని హొగ్నెకల్‌ వద్ద ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్నది. హొగ్నెకల్‌ జలపాతం అన్నది ఇక్కడ ఒకటి ఉందా..? అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. ఈ నీటి ప్రవాహం మరింతగా పెరగవచ్చు అని భావిస్తున్నారు. ఇక్కడ సెకనుకు 85 వేల క్యూసెక్కులమేరకు నీరు ప్రవహిస్తున్నది. ఇక్కడ మరింతగా నీరు ఉప్పొంగిన పక్షంలో హొగ్నెకల్‌, ఆలంపాడి, ఉట్టమలై, నాడర్‌ కోట్టం గ్రామాలలోని లోతట్టు ప్రాంతాల వైపుగా నీరు దూసుకెళ్లడం ఖాయం. దీంతో ముందు జాగ్రత్తగా హొగ్నెకల్‌ తీరంలోని గృహాలలోకి నీరు చేరడంతో ఇక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. నీటి ఉధృతి మరింతగా పెరిగే అవకాశాలతో కావేరి తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, గ్రామాలకు కావేరి నదీ మీదుగా ఉన్న చిన్న చిన్న వంతెనలు, రోడ్డు మార్గాలను మూసి వేశారు. మేట్టూరు జలాశయం నీటిమట్టం 116 అడుగులకు దాటింది. ఒకటి రెండు రోజులలో నిండుకుండగా మారనన్నది. దీంతో ఉబరి నీటిని పూర్తిగా బయటకు విడుదల చేయల్సి వస్తుంది. ఈ దృష్ట్యా, ముందు జాగ్రత్తగా అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కావేరి తీరం వెంబడి ఉన్న సేలం, ఈరోడ్‌, నామక్కల్‌, కరూర్‌, పెరంబలూరు, అరియలూరు, తిరుచ్చి, పుదుకోట్టై, తంజావూరు, తిరువారూర్‌, నాగపట్నం, కడలూరు జిల్లాల్లోని గ్రామాల ప్రజల్ని అప్రమత్తంచేశారు. కావేరి నదీ తీరంకు కూత వేటు దూరంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా , అవసరం అయితే, సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ముందు జాగ్రత్తలుచేపట్టారు. చిన్న చిన్న మార్గాలన్నీ మూసి వేసి , పోలీసు భద్రతను కల్పించారు. మేట్టూరు– ఎడపాడి ప్రధాన మార్గాన్ని సైతం మూసి వేశారు.

22 శాతం అధికంగా వర్షం

కర్ణాటక నుంచి భారీగా వరద నీరు

మహోగ్రంగా హొగ్నెకల్‌ జలపాతం

ఉప్పొంగిన నీటితో తీర ప్రాంతాలు జలమయం

నిండు కుండగా మేట్టూరు

తీరంలో అలర్ట్‌

కర్ణాటక నుంచి కావేరి నదిలో భారీగా వరద పోటెత్తుతోన్నది. ఉగ్రరూపం దాల్చి కావేరి నది ప్రవహిస్తుండటంతో తీర గ్రామాలలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేశారు. భారత నయాగారా హొగ్నెకల్‌ జలపాతం కనుమరుగైనట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ ఏడాది నైరుతీ రుతు పవనాలు కోయంబత్తూరు, నీలగిరులతోపాటూ పశ్చిమ కనుమల వెంబడి ఉన్న జిల్లాల మీద అధిక ప్రభావాన్ని చూపించాయి. మరోరెండు మూడు రోజులు కోయంబత్తూరు, నీలగిరులలో భారీవర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.జూన్‌ 1 నుంచి 27వ తేదీ వరకు తమిళనాడులో నైరుతీ రూపంలో 22 శాతం అధికంగా వాతావరణ శాఖ ప్రకటించింది. కోయంబత్తూరులో 33 సె.మీ నీలగిరులలో 26 సెం.మీ , కన్యాకుమారిలో 18 సెం.మీ వర్షం పడిందని ప్రకటలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement