వినియోగదారుల అభిరుచులే ముఖ్యం | - | Sakshi
Sakshi News home page

వినియోగదారుల అభిరుచులే ముఖ్యం

Jun 29 2025 3:04 AM | Updated on Jun 29 2025 3:04 AM

వినియోగదారుల అభిరుచులే ముఖ్యం

వినియోగదారుల అభిరుచులే ముఖ్యం

సాక్షి, చైన్నె: వినియోగ దారుల అభిరుచులే లక్ష్యంగా గ్రాండ్‌ కాంటినెంట్‌ సేవలు ఉంటాయని ఆ సంస్థ వ్యవస్థాపకుడు రమేష్‌ శివ తెలిపారు. చైన్నె టీనగర్‌లో గ్రాండ్‌ కాంటినెంట్‌ ప్రీమియర్‌ కొత్త హోటల్‌ను ప్రారంభించినానంతరం రమేష్‌ శివ మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు ఇదే హోటల్‌లో పనిచేసిన తాను, ప్రస్తుతం గ్రాండ్‌కాంటినెంట్‌ పేరిట దేశ వ్యాప్తంగా హాస్పిటాలిటీరంగంలో విస్తృత సేవలను అందిస్తున్నట్టు వివరించారు. చైన్నెలోని మిడ్‌ మార్కెట్‌ హాస్పిటాలిటీరంగంలో ఉన్నత స్థాయి సౌకర్యాలతో కొత్త బెంచ్‌ మార్క్‌గా ఈ హోటల్‌ నిలుస్తుందన్నారు. ఇది తమ 22వ హోటల్‌ అని , రానున్న రోజులలో ద్వారకా, జైపూర్‌, అయోద్య, గుర్గాంలలో హోటళ్లను ప్రారంభించనున్నామని వివరించారు. ప్రస్తుతం అత్యాధునిక సౌకర్యాలతో , వినియోగ దారుల అభిరుచులకు అనుగుణంగా సేవలను అందించడం లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. 2028 నాటికి తమ సేవలను ఐదు ఇంతలు పెంచడం లక్ష్యంగా నిర్ణయించామన్నారు. 2011 నుంచి తన పయనం మొదలైనా, కరోనా కాలంలో తీవ్ర సమస్యలు ఎదురయ్యాయని, అనంతరం క్రమంగా కోలుకుని, అందరి సహకారంతో హాస్పిటాలిటీరంగంలో ఉరకలు తీస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్‌ విద్య రమేష్‌, సీఓఓ సునీల్‌మాథూర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement