
చిన్నారుల సంరక్షణ కమిటీ సమావేశం
పళ్లిపట్టు: పళ్లిపట్టు టౌన్ పంచాయతీలో చిన్నారుల సంరక్షణ కమిటీ సమావేశం శనివారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పళ్లిపట్టు టౌన్ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన చిన్నా రుల సంరక్షణ కమిటీ సమావేశానికి పట్టణ పంచా యతీ కార్యనిర్వహణాధికారి రాజకుమార్ అధ్యక్షత వహించారు. పట్టణ పంచాయతీ కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది. విద్యావేత్తలు, పోలీసులు, తదితరుల బృందం పాల్గొన్నారు. ముఖ్య అతిఽథిగా పట్టణ పంచాయతీ చైర్పర్సన్ మణిమేగళై పాల్గొని చిన్నారుల సంరక్షణ, బాలల హక్కులను వివరించారు. ప్రధానంగా చిన్నారులు ప్రతి ఒక్కరూ పదో తరగతి వరకు నిర్భంద ఉచిత విద్య అందడంతో పాటు బాలికలపై వేధింపులు అరికట్టడం, బాల కార్మికుల నిర్మూలన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. టౌన్ పంచాయతీ మేనేజర్ కుప్పారెడ్డి, విద్యావేత్త గురుమూర్తి, ఎస్ఐ రమేష్కుమార్ సహా సభ్యులు పాల్గొన్నారు.