ముగ్గురు విద్యార్థుల అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

ముగ్గురు విద్యార్థుల అదృశ్యం

Jun 29 2025 3:04 AM | Updated on Jun 29 2025 3:04 AM

ముగ్గ

ముగ్గురు విద్యార్థుల అదృశ్యం

వేలూరు: పాఠశాలలకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. తిరువళ్లూరు నగర్‌కు చెందిన గోకుల్‌ ప్రసాద్‌, తొర్రపాడి సమీపంలోని భవానీనగర్‌కు చెందిన క్రిష్ణన్‌, కేకే నగర్‌కు చెందిన జీవ సూర్యన్‌. వీరు ముగ్గురూ తొర్రపాడిలోని రామ్‌సెట్‌ నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. ఒకే తరగతి గదిలో ఉంటున్న ముగ్గురూ తరచూ కలిసి తిరిగే వారు. శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన ముగ్గురు విద్యార్థులు సాయంత్రం పాఠశాల నుంచి బయటకు వెళ్లారు. ఇందులో ఒక విద్యార్థి మాత్రం రోజూ ఆటోలో వచ్చి వెళ్లేవాడు. దీంతో శుక్రవారం సాయంత్రం ఆటో డ్రైవర్‌ పాఠశాలకు వెళ్లినప్పటికీ ఆ విద్యార్థి ఆటోలో వెళ్లకుండా తాను తన స్నేహితులతో కలిసి వస్తానని చెప్పి, ఆటో డ్రైవర్ణు పంపి వేశాడు. అనంతరం రాత్రి 10 గంటల వరకు ముగ్గురు విద్యార్థులు ఇంటికి రాక పోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో గాలించినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించలేదు. దీంతో తల్లిదండ్రులు బాగాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురు విద్యార్థుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శనివారం సాయంత్రం వరకు కూడా విద్యార్థుల ఆచూకీ కనిపించక పోవడంతో తల్లిదండ్రలు ఆందోళన చెందుతున్నారు.

ముగ్గురు విద్యార్థుల అదృశ్యం1
1/2

ముగ్గురు విద్యార్థుల అదృశ్యం

ముగ్గురు విద్యార్థుల అదృశ్యం2
2/2

ముగ్గురు విద్యార్థుల అదృశ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement