బయోమెట్రిక్‌తో నిత్యావసర సరుకులు వద్దు | - | Sakshi
Sakshi News home page

బయోమెట్రిక్‌తో నిత్యావసర సరుకులు వద్దు

Jun 28 2025 7:45 AM | Updated on Jun 28 2025 7:45 AM

బయోమెట్రిక్‌తో నిత్యావసర సరుకులు వద్దు

బయోమెట్రిక్‌తో నిత్యావసర సరుకులు వద్దు

వేలూరు: రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌తో నిత్యావసర వస్తువుల సరఫరా చేయడాన్ని ప్రభుత్వం రద్దు చేయాలని తమిళనాడు రాష్ట్ర ప్రాథమిక సహకార కార్మికుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఆందోళనకు ఆ సంఘం జిల్లా పోరాట కమిటీ అధ్యక్షుడు విజయకుమార్‌, కోశాధికారి అనందన్‌, జిల్లా అధ్యక్షుడు వెంకటేశన్‌ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి ధర్మలింగం మాట్లాడుతూ నిత్యావసర దుకాణాల్లో ప్రస్తుతం బయోమెట్రిక్‌తో నిత్యావసర వస్తువులు సరఫరా చేసే పద్ధతిని ప్రవేశ పెట్టిందన్నారు. దీనివల్ల కార్మికులు రేషన్‌ కార్డుదారులకు సక్రమంగా వస్తువులను సరఫరా చేయలేక పోతున్నామన్నారు. రేషన్‌ దుకాణాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. రేషన్‌ దుకాణాలకు సక్రమంగా నిత్యావసర వస్తువులను గోడౌన్‌ నుంచి తీసుకు రావాలని, తరచూ అధికారులు తనఖీల పేరుతో కార్మికులను వేధించడాన్ని మానుకోవాలని డిమాండ్‌ చేశారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సతీష్‌, వినోద్‌కుమార్‌, రవి, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement