
కలెక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులతో ఆత్మహత్యాయత్నం
వేలూరు: స్థానిక కలెక్టరేట్ ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వేలూరు జిల్లా గుడియాత్తం తాలుకా కల్లూరు ఎంజీఆర్ నగర్కు చెందిన సత్యకుమార్ తన తల్లి చంద్ర, భార్య సంగీత, చెల్లెలు, ఆమె కుమార్తెతోపాటు శుక్రవారం ఉదయం వేలూరు కలెక్టరేట్కు వచ్చారు. ఆ సమయంలో వారు తీసుకొచ్చిన పెట్రోల్ను శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అక్కడ బందోబస్తులో ఉన్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని వారిపై నీటిని పోశారు. ఆ సమయంలో సత్యకుమార్ తల్లి చంద్ర ఉన్నఫళవగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో పోలీసులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు సత్యకుమార్ను విచారించగా తమ గ్రామానికి చెందిన చంద్రు అనే వ్యక్తి గత వారం తాను నిలిచి ఉన్న ప్రాంతానికి బైకులో వచ్చి తనపై దాడి చేసి గాయ పరిచాడని, ఈ విషయమై తాను గుడియాత్తం పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేశారన్నారు. దీంతో తాను వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా గుడియాత్తం పోలీసులు తమను కాదని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తావా? అని వేధింపులకు గురి చేస్తున్నారని, దీంతోనే తాము కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. అనంతరం కలెక్టరేట్లోని అధికారులకు వినతి పత్రం అందజేశారు.