
క్లుప్తంగా
6 టన్నుల
రేషన్ బియ్యం స్వాధీనం
అన్నానగర్: ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా తరలించడానికి నిల్వ చేసిన 6 టన్నుల రేషన్ బి య్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చైన్నెలోని పెరంబూరు, జమాలయ, బిన్నీ మిల్లు సమీపంలో పౌర సరఫరాల నేర దర్యాప్తు విభాగం పోలీసులు శనివారం ఉదయం సోదా లు చేశారు. అక్కడి ఒక గోడౌన్లో నిల్వ చేసిన 6,100 కిలోల రేషన్ బియ్యాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. అదే ప్రాంతానికి చెందిన అసన్మధర్ (35)తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 34 వేలు, 2 కార్గో వ్యా న్లు, 3 బైకును స్వాధీనం చేసుకున్నారు. తక్కు వ ధరకు ప్రజల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
కానిస్టేబుల్
కిడ్నాప్నకు యత్నం
తిరువళ్లూరు: హత్య కేసులో ఐదేళ్లుగా అజ్ఞాతంలో వున్న ప్రముఖ రౌడీషీటర్ను అరెస్టు చేయడానికి యత్నించిన కానిస్టేబుల్ను కారులో లాక్కెళ్లి తోసేసిన సంఘటన తిరువళ్లూరు సమీపంలో కలకలం రేపింది. చైన్నెలో గత 25 సంవత్సరాల క్రితం అన్నాడీఎంకే నేత శేఖర్ను రౌ డీ షీటర్ శివకుమార్ హత్య చేశాడు. తండ్రి హ త్యకు ప్రతీకారం తీర్చుకోవాలని శేఖర్ కుమారుడు అళగురాజ ఐదేళ్ల క్రితం శివకుమార్ను హత్య చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అప్ప టి నుంచి అళగురాజను చైన్నె పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అళగురాజ తిరువళ్లూ రు సమీపంలోని తిరుప్పాచ్చూర్లో ఉన్నట్టు స్పెషల్టీమ్ గుర్తించి అతడ్ని పట్టుకోవడానికి యత్నించారు. కారులో తప్పించుకోవడానికి యత్నించిన అళగురాజను పట్టుకోవడానికి కా నిస్టేబుల్ యత్నించగా అతడ్ని కారులోకి లా క్కుని కిలోమీటర్ వరకు తీసుకెళ్లి రోడ్డులో ప డేసి పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
పరంగిమలై
రైల్వే సబ్వే పునఃప్రారంభం
తిరువొత్తియూరు: ప్రయాణికుల సౌకర్యార్థం మూసి వేసి ఉన్న పరంగిమలై రైల్వే సబ్వేను పునఃప్రారంభించారు. సెయింట్ థామస్ మౌంట్ రైల్వేస్టేషన్లో సబ్వే చాలా సంవత్సరాలుగా ఉపయోగంలో ఉంది. ప్రస్తుతం, రైల్వేస్టేషన్ను పునరుద్ధరిస్తున్నారు. అలాగే కొత్త రైల్వే టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దీంతో రైల్వేస్టేషన్ నిర్వాహకులు సబ్వేను శాశ్వతంగా మూసివేశారు. దీంతో రైలు ప్రయాణికులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా ఆదంబాక్కం నుంచి రైల్వేస్టేషన్లోకి వెళ్లే ప్రయాణికులు రైల్వేస్టేషన్కు రావడానికి చాలా దూరం చుట్టుకుని రావాల్సి వచ్చేది. వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై మలైమలర్ నారదర్ (నగర్ వలం) ప్రాంతంలో ఒక వార్తా పత్రిక కథనం ప్రచురించింది. ఇటీవల సెయింట్ థామస్ మౌంట్ రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రజలు కూడా కేంద్ర మంత్రి మురుగన్ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లారు. దీంతో రైల్వే యంత్రాంగం సబ్వేను తిరిగి ప్రారంభించారు.
నాటుబాంబు కేసులో
నలుగురి అరెస్టు
తిరువళ్లూరు: నాటుబాంబులతో దాడి చేసిన కే సులో బాలుడు సహా నలుగురిని పోలీసులు అ రెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా పేరంబాక్కం గాంధీనగర్కు చెందిన ముఖేష్, దీపన్, జావీధ్తోపాటు ముగ్గురు మాట్లాడుతుండగా వారిపై నాటుబాంబులతో దాడి జరిగింది. దాడిలో ము ఖేష్ మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గా యపడ్డారు. పోలీసుల విచారణలో ముఖేష్ త మ్ముడు జీవానందం, చిన్నమండలి గ్రామాని కి చెందిన ఆకాష్ స్నేహితులు. వీరిద్దరు గంజాయి విక్రయిస్తున్నారని ముఖేష్ తన సోదరుడిని మందలించి కట్టడి చేశాడు. దీంతో కక్షతో ముఖేష్ను నాటుబాంబులతో దాడి చేసి హత్య చేశారని పో లీసులు నిర్ధారించారు. ఆకాష్(14), రియాజ్ (19), సంజయ్(22)తోపాటు 15 సంవత్సరాల బాలుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఎమ్మెల్యే జగన్మూర్తికి
బెయిల్ నిరాకరణ
సాక్షి, చైన్నె: తిరువేలంగాడులో బాలుడి కిడ్నాప్ కేసులో పురట్చి భారతం నేత, ఎమ్మెల్యే జగన్మూర్తి బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన్ను అరెస్టు చేయవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. గతవారం రోజులు గా ఈ వ్యవహారం తీవ్ర ఉత్కంఠను రేపుతూ వచ్చింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును జగన్మూర్తి ఆశ్రయించారు. శుక్రవారం విచారణ సమయంలో ఈ కేసులో జగన్మూర్తి కీలకభూమిక పోషించిన్నట్టు, పోలీసుల విచారణకు సహకరించడం లేదని ప్రభు త్వ తరఫు న్యాయవాదులు వాదించారు. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చిన పక్షంలో కేసులో సా క్షులను బెదిరించేందుకు అవకాశాలు ఉన్నాయ ని పేర్కొన్నారు. వాదన అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేసులో జగన్మూర్తిని పోలీసులు అరె స్టు చేయవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి.

క్లుప్తంగా