
ఈ దీపావళి మనదే!
తమిళసినిమా: ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ కథానాయకుడిగా అవతారమెత్తి లెజెండ్ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈయనే నిర్మాతగా నిర్మించిన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, శరవణన్కు కథానాయకుడిగా, నిర్మాతగా మంచి అనుభవాన్నిచ్చిందనే చెప్పారు. ఆ చిత్రంలో ఆయన నటనకు పలు కామెంట్స్ను కూడా ఎదుర్కొన్నారు. అయితే వాటిని ఆయన స్పోర్టివ్గా తీసుకోకుండా, చాలెంజ్గా తీసుకున్నారు. అలా ఆయన రెండో చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఎదుర్ నీచ్చల్, గరుడన్ చిత్రాల ఫేమ్ దురై సెంథిల్కుమార్ కథ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి పాయల్ రాజ్పుత్ నాయకిగా నటిస్తున్నారు. శ్యామ్, నటి ఆండ్రియా, బాహుబలి ప్రభాకర్, సంతోష్ ప్రతాప్, బేజీ ఇయల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్.వెంకటేశ్ చాయాగ్రహణం, జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం గురించి శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటుడు, నిర్మాత శరవణన్ మాట్లాడుతూ చిత్రం చాలా కొత్తగా , పక్కా మాస్గా ఉంటుందన్నారు. యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ అన్ని వర్గాలను అలరించేలా కమర్శియల్ అంశాలతో కూడి ఉంటుందని చెప్పారు. ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టుగా చిత్రం ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు తెలిపారు. కాగా చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని, మరో పక్క నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని , చిత్రాన్ని దీపావళికి విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ దీపావళి మనదీ, అందరిదీ అని శరవణన్ పేర్కొన్నారు.
శరవణన్