
వేల్ ిఫిలింస్ ఇంటర్నేషనల్
నుంచి 10 చిత్రాలు
తమిళసినిమా: ప్రముఖ విద్యాసంస్థల అధినేత, సినీ నిర్మాత ఐసరి గణేశ్ వేల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించి 2016లో ప్రభుదేవా హీరోగా దేవి అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత వరుసగా చిత్రాలు నిర్మిస్తున్నారు. అలా ఇప్పటివరకు 25 చిత్రాలను నిర్మించారు. ఇటీవల శివ హీరోగా సుమో అనే వినోదభరిత కథా చిత్రాన్ని నిర్మించారు. కాగా ఐసరి గణేశ్ ఇకపై వరుసగా చిత్రాలను నిర్మించనున్నారు. ఈయన 2025 నుంచి 2027 లోగా 10 చిత్రాలను నిర్మించనున్నట్లు శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ చిత్రాలను ఎవరు దర్శకత్వం వహించనున్నారన్నది తెలిపారు. అలా డాడా చిత్రం ఫేమ్ గణేశ్ కే.బాబు, కట్టా కుస్తీ చిత్రం ఫేమ్ సెల్ల అయ్యావు, పోర్ తోళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా, కనా చిత్రం ఫేమ్ అరుణ్రాజా కామరాజ్, 2018 అనే మలయాళ చిత్రం ఫేమ్ జూడ్ ఆంటని జోషఫ్, 96 చిత్రం ఫేమ్ ప్రేమ్కుమార్, మారిసెల్వరాజ్, వెట్రిమారన్, గౌతమ్ మీనన్, సుందర్.సీ తదితర దర్శకులతో చిత్రాలు చేస్తున్నట్లు ప్రకటించారు. వీరిలో సుందర్.సీ దర్శకత్వంలో నయనతార కథానాయకిగా రూపొందిస్తున్న మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రం షూటింగ్ దశలో ఉందన్నది గమనార్హం.