అగ్రీ గ్రీవెన్స్‌ను బహిష్కరించిన రైతులు | - | Sakshi
Sakshi News home page

అగ్రీ గ్రీవెన్స్‌ను బహిష్కరించిన రైతులు

Jun 28 2025 7:43 AM | Updated on Jun 28 2025 7:43 AM

అగ్రీ గ్రీవెన్స్‌ను బహిష్కరించిన రైతులు

అగ్రీ గ్రీవెన్స్‌ను బహిష్కరించిన రైతులు

తిరువళ్లూరు: తిరుపతి–చైన్నె జాతీయ రహదారి ని ర్మాణానికి 2009–2010వ సంవత్సరంలో భూము లిచ్చిన రైతులకు న్యాయమైన పరిహారం ఇవ్వడంలే దని ఆరోపిస్తూ శుక్రవారం అగ్రి గ్రీవెన్స్‌డేను రై తులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం అగ్రీ గ్రీవెన్స్‌డే నిర్వహించా రు. గ్రీవెన్స్‌డేకు రైతులు, అధికారులు హాజరయ్యారు. రైతులు తమ సమస్యలను కలెక్టర్‌కు ఏకరవు పెట్టారు. 200 మందికి పైగా రైతులు తమ సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. తిరుపతి–చైన్నె జాతీయ రహ దారి నిర్మాణం కోసం 2 వేల మంది రైతులు భూము లు ఇచ్చారన్నారు. అయితే భూములిచ్చిన రైతులకు న్యాయం జరగడం లేదని వ్యవసాయ సంఘం నేత సంపత్‌ ఆరోపించారు. తమకు న్యాయమైన పరిహారా న్ని అందించేలా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలని కోరా రు. దీంతో కలెక్టర్‌ జోక్యం చేసుకుని పరిహారం కోసం వినతి పత్రం ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. దీంతో రైతులు కలెక్టర్‌ తీరును తప్పుపట్టారు. ఇప్పటికే పలుమార్లు వినతి పత్రం ఇచ్చామని, అయినా కొత్తగా వి నతిపత్రం ఇవ్వాలని కోరడం సరికాదన్నారు. కలెక్టర్‌ తీరుకు నిరసగా, రైతులు సమావేశం నుంచి వాకౌట్‌ చేశారు. న్యాయమైన పరిహారం ఇచ్చే వరకు తమ పో రాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. అనంతరం రైతుల నుంచి వినతి పత్రాలను కలెక్టర్‌ స్వీకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement