విజేతలకు బహుమతులు ప్రదానం | - | Sakshi
Sakshi News home page

విజేతలకు బహుమతులు ప్రదానం

Jun 26 2025 6:43 AM | Updated on Jun 26 2025 6:43 AM

విజేత

విజేతలకు బహుమతులు ప్రదానం

సాక్షి, చైన్నె : జాతీయ క్రీడల్లో విజేతలైన నలుగురు క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 9.25 లక్షల బహుమతిగా ప్రకటించింది. ఈ మొత్తాన్ని క్రీడాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ వారికి అందజేశారు. ఉత్తరాఖండ్‌లో ఇటీవల 38వ జాతీయ క్రీడలు జరిగాయి. బ్యాడ్మింటన్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీల్లో తమిళనాడు జట్టు బంగారు పతకాన్ని గెలుచుకుంది. అలాగే, తమిళనాడు పురుషుల జట్టు బాస్కెట్‌ బాల్‌ పోటీలో రజిత పతకాన్ని దక్కించుకుంది. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి ఆద్యవారియత్‌కు రూ. 3.75 లక్షలు, బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారుడు తిమ్మయ్యకు రూ. 2.50 లక్షలు, బాస్కెట్‌ బాల్‌ క్రీడాకారులు ప్రణవ్‌ ప్రిన్స్‌, ప్రశాంత్‌కు తలా రూ.1.50 లక్షలను డిప్యూటీ సీఎం, క్రీడాశాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌, క్రీడల శాఖ కార్యదర్శి అతుల్య మిశ్రా, తమిళనాడు స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సభ్య కార్యదర్శి జే మేఘనాథరెడ్డి అందజేశారు.

విజేతలకు బహుమతులు ప్రదానం 1
1/1

విజేతలకు బహుమతులు ప్రదానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement