
కండెక్టర్పై దాడి
తిరుత్తణి: బస్సు ఫుట్బోర్డు ప్రయాణం చేసిన విద్యార్థులను హెచ్చరించిన కండెక్టర్పై విద్యార్థి దాడి సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. తిరుత్తణి నుంచి మంగళవారం ఉదయం తిరుత్తణి ప్రభుత్వ బస్సు డిపోకు చెందిన టౌన్ బస్సు తిరుత్తణి బస్టాండ్ నుంచి నల్లాట్టూరుకు బయలుదేరింది. ఆ బస్సు డ్రైవర్గా వాసు, తాత్కాలిక కండెక్టర్ నరేంద్రన్(28) విధులు నిర్వహించారు. బస్సులో పొన్పాడి స్టాపింగ్లో పూనిమాంగాడులోని ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులు ప్రయాణించారు. బస్సు ఖాళీగా ఉన్నా, విద్యార్థులు పుట్బోర్డుపై నిలుచుకుని ప్రయాణం చేస్తుండగా వారిని కండెక్టర్ లోపలికి రావాలని హెచ్చరించారు. అయితే విద్యార్థులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో విద్యార్థులను మందలించి, లోపలికి వెళ్లాలని సూచించడంతో విద్యార్థులు, కండెక్టర్ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన ప్లస్టూ విద్యార్థి ఒకరు కండెక్టర్పై దాడి చేశాడు. ఇందులో కండెక్టర్ నుదుటిపై గాయాలయ్యాయి. వెంటనే బస్సును పూనిమాంగాడు ప్రభుత్వాస్పత్రి వద్ద ఆపి, కండెక్టర్ చికిత్స పొందారు. అనంతరం కండెక్టర్పై దాడి సంఘటనకు సంబంధించి కనకమ్మసత్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేసున్నారు.

కండెక్టర్పై దాడి