
ఇరాన్ నుంచి చైన్నెకు తమిళ విద్యార్థులు
సాక్షి, చైన్నె: ఇరాన్లో చిక్కుకున్న తమిళ విద్యార్థులు స్వస్థలాలకు చేరుకున్నారు.23 మంది విద్యార్థులలో 11 మంది చైన్నెకు చెందిన వారు ఉన్నారు. ఇరాన్, ఇజ్రయేల్ మధ్య యుద్దంతో తమ వాళ్లు ఏమయ్యారో అన్న ఆందోళన ఇక్కడున్న కుటుంబాలలలో బయలుదేరిన విషయం తెలిసిందే. తమ వాళ్లను సురక్షితంగా రప్పించాలన్న విజ్ఞప్తులు పెరిగాయి. దీంతో ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పటు చేసింది. ఈ క్రంటోల్ రూమ్ను సంప్రదించిన వారిలో ప్రస్తుతానికి 23 మంది ఉన్నారు. వీరందర్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఢిల్లీకి మంగళవారంతీసుకొచ్చారు. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులతో చైన్నెకు తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి విద్యార్థులు ప్రత్యేక వాహనాలలో వారి వారి స్వస్థలాలకు పంపించారు. ఇందులో 11 మంది చైన్నెకు చెందిన విద్యార్థుల కాగా, మిగిలిన వారు వివిధ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు. వీరందర్నీ ప్రభుత్వ ఖర్చుతోనే స్వస్థలాలకు వాహనాలలో పంపించారు. మరి కొందరు విద్యార్థులు ఇక్కడకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో మంగళవారం యుద్ధానికి బ్రేక్ పడటం గమనార్హం.
ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట
రూ. 3.20 కోట్లు మోసం
●ఇద్దరు అరెస్టు
తిరువళ్లూరు: ఆన్లైన్ పెట్టుబడిలో అధిక వడ్డీ వస్తుందని నమ్మించి సుమారు పది మంది వద్ద రూ. 3.20 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా అంబత్తూరుకు చెందిన శివశంకర్(43), రాజీవ్గాంధీ(39) తదితర ఇద్దరు వృక్షం ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నారు. వీరి కంపెనీలో తనికవేలు(43) సహా పది మంది సుమారు 3.20 కోట్లు రూపాయలను ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడిగా పెట్టారు. పెట్టుబడిదారులకు వడ్డీ ఇవ్వకపోగా, అసలు సైతం ఇవ్వడానికి నిరాకరించి బెదిరింపులకు దిగినట్టు తెలుస్తుంది. దీంతో భాదితులు ఆవడి కమిషనర్కు పిర్యాదు చేశారు. కమిషనర్ శఽంకర్ ఆదేశాల మేరకు ఎకనమిక్స్ అఫెక్స్ వింగ్ ఇన్పెక్టర్ కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఇద్దరి వద్ద ఉన్న రెండు విలువైన కార్లు, సెల్ఫోన్లతో పాటూ బ్యాంక్లోని అకౌంట్ను ప్రీజ్ చేసి సుమారు 50 లక్షలు విలువ చేసే మొత్తాన్ని సీజ్ చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
విమానంలో రూ.3 కోట్ల విలువైన గంజాయి సీజ్
తరలిస్తున్న యువకుడి అరెస్టు
అన్నానగర్: మదురైకి వస్తున్న విమానంలో రూ.3 కోట్ల విలువైన గంజాయి, హై–గ్రేడ్ కొకై న్ను అక్రమంగా రవాణా చేస్తున్నందుకు ఓ యువకుడిని అరెస్టు చేశారు. శ్రీలంక రాజధాని కొలంబో నుంచి మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఓ ప్రయాణికుల విమానం మధురై విమానాశ్రయానికి చేరుకుంది. దిగిన ప్రయాణికుల వస్తువులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో, భారత పాస్పోర్ట్ హోల్డర్ ప్రయాణికుడి ఆధీనంలో 6 ప్యాకెట్లలో ఆకుపచ్చ రంగులో భిన్నమైన పదార్థం కనిపించింది. అధికారులు పరీక్షించి హై–గ్రేడ్ గంజాయిగా గుర్తించారు. దర్యాప్తులో అతను తూత్తుకుడి జిల్లాలోని కాయల్పట్టు నివాసి అలీ అబ్దుల్ ఖాదర్ (52) అని, థాయిలాండ్ నుంచి శ్రీలంక మీదుగా విమానంలో మదురైకి వస్తున్నట్లు తేలింది. దీంతో కస్టమ్స్ అధికారులు సోమవారం రాత్రి అలీ అబ్దుల్ ఖాదర్ను అరెస్టు చేసి, అతని నుంచి రూ.3 కోట్ల విలువైన హైగ్రేడ్ గంజాయి, సిగరెట్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.
11 విమానాలు రద్దు
కొరుక్కుపేట: ఇజ్రాయిల్, ఖతార్ మధ్య యుద్ధ ఉద్రిక్తత పెరుగుతోంది. నిన్న రాత్రి సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరంపై దాడి జరిగింది. దీని తరువాత, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , బహ్రెయిన్ తమ వైమానిక ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశాయి. ముఖ్యంగా, సౌదీ అరేబియాలో ప్రధాన కార్యాలయం ఉన్న ఖతార్ ఎయిర్లైన్స్ తదుపరి నోటీసు వచ్చేవరకు తన అన్ని విమానాలను నిలిపివేయాలని ఆదేశం జారీ చేసింది. దీంతో కువైట్, అబుదాబి, దుబాయ్ సహా చైన్నెకి 11 విమానాలు రద్దయ్యాయి. థాయిలాండ్ నుంచి దోహాకు 3 విమానాలు చైన్నెలో నిలిచిపోయాయని వెల్లడించారు.దీని కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విదేశాలకు వెళ్లే ప్రయాణికులు తమ విమానాలు ఎప్పుడు బయలుదేరుతాయి, ఎప్పుడు వస్తాయో తెలుసుకోవడానికి వారి సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదిస్తున్నారు. చైన్నె విమానాశ్రయ అధికారులు తమ విమానాలను తిరిగి షెడ్యూల్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. విమానాల రద్దు, ఆలస్యం కారణంగా వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా, తిరుచ్చి నుంచి షార్జా , దుబాయ్లకు విమానాలు రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ రోజు తిరుచ్చి నుంచి నడపాల్సిన తిరుచ్చి–షార్జా, దుబాయ్–తిరుచ్చి , తిరుచ్చి–దుబాయ్ విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. దీని కారణంగా, ఈ విమానాలలో ప్రయాణించాల్సిన ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు.