
ఉచిత శస్త్ర చికిత్సలే లక్ష్యంగా ఒప్పందాలు
● ప్రాజెక్ట్ జీవన్తో సేవలు
సాక్షి, చైన్నె: ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు, పుట్టుకతోనే వెన్నెముక , మెదడు రుగ్మతలతో బాధ పడుతున్న పిల్లలకు ఉచిత శస్త్ర చికిత్సల నిర్వహణకు కావేరి ఆస్పత్రిలో ప్రాజెక్ట్ జీవన్ను ప్రారంభించారు. ఇందుకు సంబంధించి మంగళవారం రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నె మిత్రా, రోటరీ బెంగళూరు ఐటీ కారిడార్ లీడ్ క్లబ్లతో కావేరి ఆస్పత్రి ఒప్పందాలు జరిగాయి. స్పినా బిఫిడా, మైలో మెనింగో సెల్, టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్, స్కోలియోసిస్, స్పైనల్ ట్యూమర్స్ వంటి సమస్యలతో బాధ పడుతున్న పేద వర్గాల పిల్లల జీవితాన్ని ఆనందమయంచేయడం లక్ష్యంగా శస్త్ర చికిత్సలను ఉచితంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. చైన్నె ఆళ్వార్ పేటలోని కావేరి ఆస్పత్రిలో మల్టీ డిసిప్లినరీ బృందం, వైద్య బృందంతో కలిసి సీఎస్ఆర్ ద్వారా సేకరించిన రూ. 85 లక్షలతో మొదటి విడుదలగా ప్రాజెక్ట్ జీవన్ కోసం 35 మంది పిల్లలకు ఉచితంగా క్లిష్టమైన శస్త్ర చికిత్సల నిర్వహణ కు చర్యలు తీసుకున్నారు.ఈ ఒప్పందాల కార్యక్రమంలో కావేరి గ్రూప్ ఆఫ్ ఆస్పత్రి వ్యవస్థాపకుడు డాక్టర్ అరవింద్ సెల్వరాజ్, రోటరీ ప్రతినిధులు ఎన్ఎస్శరవణన్, సాయి శేషన్, అనిల్ గుప్తా, డాక్టర్రవి వర్మ, కావేరి వైద్యుల బృందం డాక్టర్ జి. బాలమురళి, డాక్టర్ మహేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.