
యోగాతో సరికొత్త ఉత్తేజం
వేలూరు: పురాతన చరిత్ర కలిగిన యోగా శిక్షను విద్యార్థులతో పాటూ ప్రతి ఒక్కరూ చేయాలని వేలూరు జూనియర్ రెడ్క్రాస్ కార్యదర్శి జనార్ధణన్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురష్కరించుకుని ఆదివారం ఉదయం కాట్పాడిలోని జూనియర్ రెడ్క్రాస్ అద్వర్యంలో కాట్పాడిలోని యోగా శిక్షణా కేంద్రంలో అంతర్జాతీయ యోగా శిక్షణ తరగతులు జరిగిని ఈ శిక్షణను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ ఐక్యరాజ్య సమతి ద్వారా జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా గత 2015వ సంవత్సరంలో ప్రకటించడం జరిగిందన్నారు. ఈ యోగాను మన సిద్దర్లు గత ఐదు వేల సంవత్సరాల క్రితమే చేశారన్నారు. ప్రపంచంలోని ప్రజలు తెలుసుకునే విధంగా ఈ యోగా ప్రాధాన్యతను ప్రకటించడం అభినందనీయమన్నారు. ఇది ఒక రోజు చేసే శిక్షణ కాదని ప్రతి రోజూ వీటిని అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తిరువణ్ణామలై తపోయోగివనం ఆశ్రమం నిర్వహకుడు సనంతా స్వామిజీ, వేలూరు ఈట్టురుద్ది ఆస్పత్రి డాక్టర్ మీరా, జూనియర్ రెడ్ క్రాస్ సంఘం ఉపాధ్యక్షులు శ్రీనివాసన్, సభ్యులు దీనబంధు, సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.