
అధికారులు ఆదర్శంగా ఉండాలి
తిరువళ్లూరు: ప్రభుత్వ అధికారుల పనితీరు అందరికి ఆదర్శంగా వుండాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. తిరువళ్లూరు కలెక్టరేట్లో గ్రామీణాభివృద్ధిశాఖకు చెందిన అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత వుండేలా చూడాలని ఆదేశించారు. అనంతరం కలైంజ్ఞన్ పక్కాగృహాల పథకం, తారు, సిమెంట్ రోడ్డు నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం గ్రామీణాభివృద్ధిశాఖలో నిష్పక్షపాతంగా పని చేసిన పలువురు అధికారులను కలెక్టర్ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, చీఫ్ ఇంజినీర్ రాజవేలు, డిప్యూటీ డైరెక్టర్ యువరాజ్,ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ప్రియారాజన్ ల్గొన్నారు.