అన్ని రంగాల్లో అభివృద్ధికి చిహ్నంగా మారిన తమిళనాడు రహదారులు, రోడ్ల విస్తరణలో దూసుకెళ్తోందని సీఎం స్టాలిన్‌ అన్నారు. ఈ మేరకు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. | - | Sakshi
Sakshi News home page

అన్ని రంగాల్లో అభివృద్ధికి చిహ్నంగా మారిన తమిళనాడు రహదారులు, రోడ్ల విస్తరణలో దూసుకెళ్తోందని సీఎం స్టాలిన్‌ అన్నారు. ఈ మేరకు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.

Jun 23 2025 5:58 AM | Updated on Jun 23 2025 5:58 AM

అన్ని

అన్ని రంగాల్లో అభివృద్ధికి చిహ్నంగా మారిన తమిళనాడు రహదా

సాక్షి, చైన్నె: దేశంలోనే హైవేల రంగంలో అత్యుత్తమ రాష్ట్రంగా తమిళనాడు కొత్త చరిత్ర సృష్టిస్తున్నట్లు సీఎం ఎంకే స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల డీఎంకే ప్రభుత్వంలో రహదారుల అభివృద్ధికి సంబంధించిన నివేదికను ఆదివారం సీఎం స్టాలిన్‌ ఆదేశాలతో ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి. అందులో.. శ్ఙ్రీఒక దేశ ఆర్థికాభివృద్ధికి రోడ్డు సౌకర్యాలు చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. తమిళనాడు ఆర్థిక వ్యవస్థను పెంచే లక్ష్యంతో కలైంజ్ఞర్‌ కరుణానిధి రహదారులను మెరుగు పరచడంలో గతంలో దృష్టి పెట్టారు. రహదారుల శాఖ నేతృత్వంలో తమిళనాడు హైవే రంగంలో అత్యుత్తమంగా మారింది. 2021 తర్వాత రోడ్ల అభివృద్ధి మీద మరింత ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. రహదారుల అభివృద్ది ప్రాజెక్టుకు రూ. రూ. 3,858 కోట్ల అంచనా వ్యయంతో 448 కి.మీ., రూ. 2,207 కోట్ల వ్యయంతో 1,681 కి.మీ పొడవున్న టూ వే, ఫోర్‌ వేలను అభివృద్ధి పరిచారు. రూ. 2,807 కోట్ల అంచనా వ్యయంతో 383 కి.మీ. పొడవైన నాలుగు లేన్ల రహదారి పనులు, రూ. 709 కోట్ల అంచనా వ్యయంతో 357 కి.మీ. పొడవైన టూ వే పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ రోడ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్మెంట్‌ ప్రాజెక్ట్‌ రూ. 17,154 కోట్ల అంచనా వ్యయంతో 9,620 కి.మీ. రోడ్డు పనులు, 996 చిన్న పెద్ద వంతెనలను రూ 1,161 కోట్లుతో పూర్తి చేశారు. 164 కి.మీ. దూరం రూ. 731 కోట్లతో పట్టణాలలో రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. రూ. 2,074 కోట్ల అంచనా వ్యయంతో 6,805 కి.మీ. దూరం మట్టి రోడ్డులు తారు రోడ్డులుగా మారాయి. రూ. 662 కోట్ల అంచనా వ్యయంతో 1,652 రోడ్డు భద్రతా పనులు పూర్తి చేశారుశ్రీశ్రీ అని పేర్కొన్నారు.

ఇతర ముఖ్యమైన పనులు

● మన్నచనల్లూర్‌ – ఇలుపూర్‌ మధ్య రూ. రూ. 307.8 కోట్లు, పార్థిబనూర్‌, రాసిపురం,తిరుతురైపూండి – భవానీ మధ్య పేజ ఒన్‌ పనులు, ముదుగలత్తూర్‌, తిరుత్తణి, కూనూర్‌ నమక్కల్‌ తదితర పది బైపాస్‌ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఈరోడ్‌ జిల్లాలోని విల్లరసంపట్టిలో రూ. 20.85 కోట్ల వ్యయంతో తిండాల్‌ జంక్షన్‌ నుండి కనీరావుత్తరం కులం వరకు , జవాన్స్‌ భవన్‌ – పసుమలై లింక్‌ రోడ్డు రోడ్డు రూ. 1.97 కోట్లుతో అమల్లోకి తెచ్చారు. 5,064.53 కి.మీ పొడవున్న పంచాయతీ, రోడ్లు రూ. 4,907.17 కోట్లతో పంచాయతీ యూనియన్‌ రోడ్లను, జిల్లా ఇతర రోడ్లుగా అప్‌గ్రేడ్‌ చే శారు. అంతర్జాతీయ ఆర్థిక సహాయంతో రూ. 1,330.70 కోట్లతో చైన్నె–కన్యాకుమారి, రూ.240.06 కోట్లతో నక్కసలేం – కురుంబలూరు బైపాస్‌, రూ. 349 కోట్లతో తురైయూర్‌ పెరంబలూర్‌ రోడ్డు, మోహనూర్‌ రోడ్డు, రూ. 251 కోట్లతో నామక్కల్‌ – సేంతమంగళం రాశిపురం రోడ్డు, రూ.251.29 కోట్లతో విరుదాచలం– ఉలుందూర్‌ పేట, రూ. 238.90 కోట్లతో తంజావూరు – మన్నార్గుడి రోడ్డు, రూ. 250.51 కోట్లతో తిరుపత్తూరు రోడ్డుతో సహా 5 రోడ్డు పనులు పూర్తి చేశారు. చైన్నెలోని తిరువొత్తియూర్‌లో రూ. 58.64 కోట్లు పొన్నేరి–పంచెట్టి రోడ్డులో బకింగ్‌హామ్‌ కాలువ మీదుగా హై–లెవల్‌ వంతెన, కాంచీపురం జిల్లా ఉతిరమేరూరులో రూ. 21.56 కోట్లతో సెయ్యారి నది పై వంతెన అంటూ అనేక వంతెనల నిర్మానాలు పూర్తి చేశారు. రూ. 59 కోట్లతో చైన్నె–పొన్నెరికరై కాంచీపురం రహదారిపై రైల్వే ఫ్లైఓవర్‌, రూ. 37.12 కోట్లతో ఊరపాక్కం సమీపంలోని వండలూర్‌ – గూడువాంజేరి రైల్వే వంతెన వంటి మరెన్నో పనులు పూర్తి చేశారు.

కొనసాగుతున్న ప్రధాన ప్రాజెక్టులు..

● కోయంబత్తూరు వెస్ట్రన్‌ రింగ్‌ రోడ్‌, మన్నర్గుడి ఫేజ్‌–1, అంబసముద్రం, తిరుచెంగోడ్‌ , భవానీ ఫేజ్‌– 1, నామక్కల్‌, పొల్లాచి వెస్ట్రన్‌ బైపాస్‌, అరుప్పుకోట్టై వెస్ట్రన్‌ బైపాస్‌, కౌముది శివగంగై ఫేజ్‌ –1, ఉత్తిర మేరూర్‌ , తురయూరు , తాంబరం ఈస్ట్‌ బైపాస్‌, తిరుపోరూర్‌, కేలంబాక్కం ప్రాంతాల్లో బైపాస్‌ రోడ్ల నిర్మాణ పనులుజరుగుతున్నాయి. రూ. 944.21 కోట్లతో పంచాయతీ యూనిట్ల పరిధిలోని 812.8 కి.మీ దూరం రోడ్లను అప్‌ గ్రేడ్‌ చేస్తున్నారు. రూ. 331 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌.

● అభివృద్ధి ప్రణాళిక కింద 373 రోడ్డు భద్రతా పనులు, ఇంటిగ్రేటెడ్‌ రోడ్స్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ కింద 2,264 కి.మీ. రోడ్డు పనులు రూ. 8,076 కోట్ల అంచనా వ్యయంతో, రూ.694 కోట్ల విలువైన 69 వంతెనలు రూ.763.80 కోట్లతో 134 హై–లెవల్‌ వంతెనలుగా అప్‌గ్రేడ్‌ పనులు జరుగుతున్నాయి. నాబార్డ్‌ రుణ సహాయంతో రూ. 375.32 కోట్లతో 32 హై లెవల్‌ వంతెనలు, రూ. 596 కోట్లతో 19 ఉన్న స్థాయి వంతెనలు, రూ. 1791 కోట్లతో కోయంబత్తూరులో గోల్డ్‌వినన్స్‌, ఉప్పిలిపాళయం హై–లెవల్‌ రోడ్డు నిర్మాణం, రూ. 621 కోట్లతో చైన్నె తేనాం పేట, సైదా పేట మధ్య ఎలివేటెడ్‌ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం.

● రూ. 190.40 కోట్ల అంచనా వ్యయంతో మధురైలోని గోరిపాలయం జంక్షన్‌ వద్ద రోడ్‌ ఫ్లైఓవర్‌, మధురైలోని మధురై–తోండి రహదారిపై రూ. 150.28 కోట్ల అంచనా వ్యయంతో రోడ్డు పనులతో పాటుగా రూ.2,105.49 కోట్ల అంచనా వ్యయంతో 41 రైల్వే ఫ్లైఓవర్లు, రైల్వే అండర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు రూ. 27.5 కోట్లతో చేపట్టారు.

● టైడల్‌ పార్క్‌ జంక్షన్‌ వద్ద యూ ఆకారం ఫ్లైఓవ ర్‌ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నాయి. చైన్నె మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ పనులు రూ.590.51 కోట్లతో సర్దార్‌ పటేల్‌ రోడ్డు, రూ. 60.69 కోట్లతో రాజీవ్‌ గాంధీ రోడ్డు రోడ్డుతో కలిసే మధ్య కైలాష్‌ జంక్షన్‌ వద్ద పనులు జరుగుతున్నా యి. రూ. 45.50 కోట్లతో మొగలివాక్కం వరకు ఫ్లైఓవర్‌ నిర్మాణం ,మడిపాక్కం సమీపంలో వాహ న సబ్‌ వే నిర్మాణం, రూ. 30.67 కోట్లతో నెల్సన్‌ మాణిక్కం రోడ్‌ జంక్షన్‌ – సెంథిల్‌ నగర్‌ జంక్షన్‌ వద్ద 2 పాద చారుల వంతెన, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుపై రూ. 139.17 కోట్లతో రైల్వే వంతెన వంటి పనులకు చైన్నె మెట్రోపాలిటన్‌ అభివృద్ధి ప్రాజెక్టు ద్వా రా జరుగుతున్నట్టు ఆ నివేదికలో వివరించారు.

● భారతదేశంలోనే తమిళనాడు రహదారులలో అత్యుత్తమ రాష్ట్రంగా కొత్త చరిత్ర సృష్టిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక, పర్యాటక ప్రాంతం కన్యాకుమారిలో రహదారుల శాఖ నేతృత్వంలో వివేకానంద రాక్‌ – తిరువళ్లువర్‌ విగ్రహాన్ని అనుసంధానిస్తూ సముద్రంలో నిర్మించిన అద్దాల వంతెన ప్రత్యేకతను చాటుకుంటున్నట్టు వివరించారు. ఇక రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాలే కాదు, రహదారుల పర్యవేక్షణ, నిర్మాణ పనుల నిమిత్తం 84 అసిస్టెంట్‌ ఇంజనీర్లు, 416 జూనియర్‌ ఆఫీసర్లు, 182 అసిస్టెంట్స్‌, 3 ఆడిటర్‌అసిస్టెంట్స్‌ , 67 జూనియర్‌ అసిస్టెంట్స్‌, అంటూ 919 మందిని నియమించినట్టు వివరించారు.

సీఎం స్టాలిన్‌తో ఇంజినీర్లు

రహదారులలో..

అత్యుత్తమం

రాష్ట్ర నాలుగేళ్ల ప్రగతి నివేదిక విడుదల

రూ. 17,154 కోట్లతో 9,620 కి.మీ దూరం పనులు

రూ. 6,065 కోట్లతో గ్రామీణ రోడ్ల

అభివృద్ధి

సీఎం స్టాలిన్‌ వెల్లడి

అన్ని రంగాల్లో అభివృద్ధికి చిహ్నంగా మారిన తమిళనాడు రహదా1
1/2

అన్ని రంగాల్లో అభివృద్ధికి చిహ్నంగా మారిన తమిళనాడు రహదా

అన్ని రంగాల్లో అభివృద్ధికి చిహ్నంగా మారిన తమిళనాడు రహదా2
2/2

అన్ని రంగాల్లో అభివృద్ధికి చిహ్నంగా మారిన తమిళనాడు రహదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement