
మహిళల అభ్యున్నతే లక్ష్యం
తిరుత్తణి: డీఎంకే ప్రభుత్వంలో మహిళల అభ్యున్న తే లక్ష్యంగా ముఖ్యమంత్రి పథకాలు అమలు చేసి మహిళల జీవితాల్లో వెలుగులు నింపినట్లు మంత్రి నాజర్ పేర్కొన్నారు. డీఎంకే పాలన నాలుగేళ్లు పూర్తి సందర్భంగా తిరువళ్లూరు జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎన్.కండ్రగ గ్రామంలో శనివారం వీధి ప్రచారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి ఎమ్మెల్యే చంద్రన్ అధ్యక్షతన జరిగిన ప్రచార సభలో మంత్రి నాజర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్షం ఆటంకం సృష్టించినా మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. మహిళలు ఆర్ధికంగా ఎదిగేందుకు వీలుగా ప్రభుత్వం పధకాలు రూపకల్పన చేసి ఆదుకుంటున్నట్లు, తద్వారా మహిళా సమాజనం అభివృద్ధి బాటలో పయనిస్తున్నట్లు తెలి పారు. పట్టణాలతో పాటు గ్రామాల్లో సైతం మౌలి క సదుపాయాలు కల్పించి అభివృద్ధిలో పరుగులు పెడుతున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు మూకుమ్మడిగా డీఎంకే ప్రభుత్వంకు తమ మద్దతు పలికి ఆదరించాలని కోరారు. జిల్లా యువజన విభాగ కన్వీనర్ కిరణ్, మండల కార్యదర్శి విజయకుమార్, పార్టీ ప్రచారకులు శివాజీ కృష్ణమూర్తి, రాజరాజేశ్వరి పాల్గొన్నారు.