
రవిమోహన్ @23
తమిళసినిమా: ప్రస్తుతం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన స్టార్ నటుడు రవి మోహన్. జయం చిత్రంతో కథానాయకుడిగా ప్రారంభించి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్న నటుడు ఈయ న. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపో తూ అగ్రకథానాయకుల్లో ఒకరిగా రాణిస్తున్న రవిమోహన్ ఇటీవల వ్యక్తిగతంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే వాటిని నటుడిగా తన కెరీర్కు ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈయనకు ప్రస్తుతం ఒక భారీ విజయం చాలా అవసరం. అందుకోసం దర్శకుడిగా, నిర్మాత గా కూడా రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈయన గణేష్ కె బాబు దర్శకత్వంలో కరాటే బాబు అనే చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు అదేవిధంగా సుధాకొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ కథానాయకుడుగా నటిస్తున్న పరాశక్తి చిత్రంలో ప్రతినాయకుడిగా వైవిధ్యభరిత పాత్రలో నటిస్తున్నారు. కార్తీక్ యోగి దర్శకత్వంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈచిత్రాన్ని ఈయనే నిర్మించనుండ డం విశేషం. దీనికి బ్రోకోడ్ అనే టైటిల్ నిర్ణయించా రు. రవిమోహన్ కథానాయకుడిగా పరిచయమైన జయం చిత్రం విడుదలై 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆయన ఇన్స్ట్రాగామ్లో భగవంతుడికి కృతజ్ఞతలు అని పోస్ట్ పెట్టారు. ఈయన పెట్టిన ఈ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రవిమోహన్ కథానాయకుడిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పలువురు హితులు, సన్నిహితులకు మంచి పార్టీని ఇచ్చినట్లు సమాచారం.