రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Jun 22 2025 7:14 AM | Updated on Jun 22 2025 7:14 AM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

– ఇద్దరికి గాయాలు

తిరువొత్తియూరు: శివగంగ జిల్లా దేవకోట్టైకి చెందిన కృష్ణన్‌, అతని భార్య అయోతి అమ్మాళ్‌. ఈ దంపతులకు కుమార్తె కలైచ్సెల్వి, కుమారుడు వెంకటేశన్‌ ఉన్నారు. వెంకటేశన్‌కు కలైయార్‌ ఆలయానికి సమీపం వాలైపెరుమల్‌ గ్రామానికి చెందిన ముత్తు కృష్ణన్‌ కుమార్తె సంగీతతో వివాహం జరిగింది. గర్భవతి అయిన సంగీత తన తండ్రి ఇంటికి వచ్చి ఉంది. ఈ క్రమంలో కోడలు ఆమె అత్తగారు అయోతి అమ్మాళ్‌, సంగీత ఆడ బిడ్డ కలైసెల్వి దేవకోట్టై నుంచి వాలైపెరుమల్‌ గ్రామానికి వెళ్లారు. వెల్లారండల్‌ బస్టాప్‌ వద్ద నుంచి ముత్తుకృష్ణన్‌కు ఫోన్‌ చేశారు. దీంతో ముత్తు కృష్ణన్‌ అక్కడికి మెప్పేడులో వెళ్లి వారిద్దరినీఎక్కించు బయలుదేరారు. కలైయార్‌ ఆలయం వద్ద వస్తున్న సమయంలో గూడ్స్‌ వాహనం ముత్తు కృష్ణన్‌ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముత్తుకృష్ణన్‌, అయోతియమ్మాళ్‌ అదేచోట మృతి చెందారు. కలైసెల్వి గూడ్స్‌ వాహనం డ్రైవర్‌ శంకర్‌ గాయాలతో శివగంగ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేరారు.కలైయార్కోవిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శరవణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రత్యేక సందేశం

తిరుప్పూర్‌లోని రామ్‌ రాజ్‌ కాటన్‌ పరిశ్రమలో ఉద్యోగ, సిబ్బందికి యోగా డే సందర్భంగా మనస్తత్వ శాస్త్ర నిపుణుల ద్వారా ప్రత్యేక ప్రసంగం అందించారు. యోగా ప్రాముఖ్యత, ప్రయోజనాలు, దైనందిన జీవితంలో అభ్యాసాలను గురించి, సమస్యల పరిష్కారానికి అవకాశాలను సందేశం రూపంలో తెలియజేశారు. – సాక్షి, చైన్నె

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement