అభివృద్ధి పనులు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

Jun 22 2025 7:14 AM | Updated on Jun 22 2025 7:14 AM

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

వేలూరు: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి, పనులను పూర్తి చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర కమిషనర్‌ పొన్నయ్య అధికారులను ఆదేశించారు. రాణిపేట జిల్లా ఆర్కాడు యూనియన్‌ పరిధిలోని నంద్యాలం గ్రామ పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్‌ చంద్రకళ అధ్యక్షతన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం నిర్మిస్తున్న పాఠశాల నిర్మాణ పనులు, ప్రభుత్వ కార్యాలయ నిర్మాణ పనుల్లో నాణ్యత ఉందా? అనే విషయాలను పరిశీలించారు. అనంతరం కూలీల వద్ద సక్రమంగా కూలీలు అందజేస్తున్నారా? అని కూలీలను అడిగారు. అనంతరం అరపాక్కం గ్రామ పంచాయతీలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు, అనంతరం అన్నామరుమలర్చి పథకం కింద రూ.17.25 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులు తదితర వాటిని తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఇల్లు నిర్మాణ పనులను తనిఖీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement