
త్వరలో సేలం డిఫెన్స్ కారిడార్
కేంద్ర మంత్రి కుమారస్వామి
సేలం : సేలంలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించి నాలుగైదు నెలల్లో ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి డి కుమార స్వామి తెలిపారు. సేలంలోని స్టీల్ ప్లాంట్ను శనివారం సందర్శించారు. ఇక్కడి ఉత్పత్తులు, సాంకేతికత అమలు గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను మరింత అభివృద్ధి పరిచే దిశగా చర్యలు చేపట్టామన్నారు. మళ్లీ దీన్ని లాభాల్లో నడిపించడమే ధ్యేయంగా పేర్కొన్నారు. వివిధ కొత్త ఉత్పత్తులపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ఆవరణలో డిఫెన్స్ కారిడార్కు సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయన్నారు. ఆర్మీకి అవసరమయ్యే అన్ని రకాల పరికరాల ఉత్పత్తులు ఇక్కడ జరిగే రీతిలో చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు సంబంధించిన నాలుగైదు నెలల్లో ప్రకటన వెలువడుతుందన్నారు. తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడం లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
నేడు టాటా ప్లేలో
విజయ్ బర్త్డే వేడుకలు
సాక్షి, చైన్నె: దళపతి విజయ్ బర్త్ డే వేడుకలను టాటా ప్లే బింగే వేదికగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. ఆదివారం విజయ్ బర్త్డే వేడుకలను కోలాహలంగా నిర్వహించేందుకు టీవీకే వర్గాలు సిద్ధమైన విషయం తెలిసిందే. వాడవాడలా బ్రహ్మోండ సేవలతో కార్యక్రమాలు జరగనున్నాయి. అదే సమయంలో టాటా ప్లే బింగేలో 30కు పైగా ఉన్న ఓటీటీ ప్లాట్ ఫామ్లో విజయ్ ఐకానిక్ బ్లాక్ బస్టర్లతో పాటూ కేక్ కట్టింగ్లు వంటి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు విజయ్ నటించిన వారిసు, మాస్టర్, తలైవా, థెరి, వంటి బ్లాక్ బస్టర్లను వీక్షించే అవకాశం కల్పించారు.
ఎమ్మెల్యే అముల్ కందస్వామి కన్నుమూత
● అన్నాడీఎంకే వర్గాల్లో దిగ్బ్రాంతి
సాక్షి, చైన్నె: కోయంబత్తూరు జిల్లా వాల్పారై ఎమ్మెల్యే అముల్ కందస్వామి (60) శనివారం కన్ను మూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో మరణించారు. అన్నాడీఎంకేలో ఎంజీఆర్ యువజన విభాగం కార్యదర్శితో పాటూ పలు విభాగాలలో అముల్ కందస్వామి పనిచేశారు. 2021 ఎన్నికలలో వాల్పారై నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఆయనకు దక్కింది. ఇక్కడి నుంచి తొలి సారిగా అసెంబ్లీకి ఎన్నికై న ఆయన కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ తొలుత ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందారు. విశ్రాంతిలో ఉన్న సమయంలో ఆదివారం మళ్లీ అనారోగ్య సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా సాయంత్రం కన్నుమూశారు. ఈ సమాచారంతో అన్నాడీఎంకే వర్గాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తన సంతాపం తెలియజేశారు. కోయంబత్తూరు, సేలం, ఈరోడ్ జిల్లాలోని అన్నాడీఎంకే నేతలందరూ అముల్ కందస్వామి నివాసం వద్దకు చేరుకున్నారు. ఆయన భౌతిక కాయాన్ని అన్నూరులోని స్వగృహంలో ఉంచారు. ఆదివారం అంత్యక్రియలు జరగనున్నాయి.
మాజీ మంత్రిపై
ఎస్పీకి ఫిర్యాదు
కొరుక్కుపేట: డీఎంకే మంత్రి టీఆర్బీ రాజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయ్కుమార్పై డీఎంకే నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఎంకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందం ఫిర్యాదు చేసింది. మధురై సౌత్ జిల్లా డీఎంకే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీమ్ ఆర్గనైజర్ జయచంద్రన్ నేతృత్వంలోని డీఎంకే సభ్యులు శనివారం మధురై ఎస్పీ అరవింద్కు ఒక వినతిపత్రం సమర్పించారు. తరువాత, వారు విలేకరులతో మాట్లాడారు. తమిళనాడు పరిశ్రమల మంత్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టీమ్ కార్యదర్శి టీఆర్బీ రాజాపై అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్పీ ఉదయకుమార్ అగౌరవపరిచేలా, అబద్ధాలు వ్యాప్తి చేసేలా మాట్లాడారన్నారు. ఆయన ప్రసంగం రాజకీయ లాభం కోసం, రాజకీయ వ్యవస్థకు బాధ్యత వహించే మంత్రిని బెదిరించేలా ఉందన్నారు. తన సొంత ఉనికిని కాపాడుకోవడానికి మాజీ మంత్రి అలా మాట్లాడారని ఆరోపించారు. అతను ఉద్రిక్తత సృష్టించేలా, ప్రజా శాంతికి భంగం కలిగించేలా, రెండు వర్గాల మధ్య హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడారని అన్నారు. అతనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

త్వరలో సేలం డిఫెన్స్ కారిడార్